ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే
ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్కు పనులు కర్నూలు జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్న అధికారులు పనులు జరుగుతున్న తీరుపై రోజువారీ
ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్కు పనులు కర్నూలు జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్న అధికారులు పనులు జరుగుతున్న తీరుపై రోజువారీ సమీక్ష నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, గడివేముల మండలాల్లోని శకునాల, గని గ్రామాల పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తున్న సోలార్ పార్కు ప్రపంచంలోనే అతి పెద్దదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
విద్యుత్ ఉత్పత్తి పనులు ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడానికి అంగీకరించారని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో ఈ పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. రెండు మండలాల్లోని 5,400 ఎకరాల్లో వెయ్యి మెగావాట్(1గిగావాట్) సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ పార్క్ ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో 750 మెగావాట్ల సౌర విద్యుత్ను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థ, 250 మెగావాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి చేయనుంది. ఈ పార్కులో రాష్ట్రప్రభుత్వం, డెవలపర్లు కలిసి రూ.7వేల కోట్లను పెట్టుబడిగా పెట్టారు.