30వేలకు పైనే సెన్సెక్స్
బుధవారం రికార్డు స్థాయిలను నమోదు చేసిన దేశీయ సూచీలు గురువారం నష్టాలకు గురయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 103.61పాయింట్లు(0.34) దిగజారి 30029 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 9.7 పాయింట్లు కోల్పోయి(0
* 100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
బుధవారం రికార్డు స్థాయిలను నమోదు చేసిన దేశీయ సూచీలు గురువారం నష్టాలకు గురయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 103.61పాయింట్లు(0.34) దిగజారి 30029 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 9.7 పాయింట్లు కోల్పోయి(0.1%) 9342 వద్ద ముగిసింది. ట్రేడర్లు లాభాల బుకింగ్కు మొగ్గుచూపడమే ఇందుకు కారణం
రంగాల వారీగా చూస్తే బీఎస్ఈ సెన్సెక్స్లో స్థిరాస్తి(0.69%), ఐటీ(0.52%), చమురు,సహజవాయు(0.41%), టెక్నాలజీ(0.4%) పైకి ఎగశాయి. మరో వైపు లోహ రంగం(1.03%), ఎఫ్ఎంసీజీ(0.72%), హెల్త్కేర్(0.71%), ఆటో(0.12%) నష్టపోయాయి. సెన్సెక్స్ కంపెనీల్లో గెయిల్(1.18%), టాటా మోటార్స్ (1.14%), సిప్లా (1.11%), ఇన్ఫోసిస్ (1.08%), విప్రో (1.04%) లాభాలను గడించగా, లుపిన్ (-2.48%), యాక్సిస్ బ్యాంక్ (-2.19%), ఐటీసీ (-1.91%), టాటా స్టీల్ (-1.87%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.55%) నష్టాలకు గురయ్యాయి.