For Quick Alerts
For Daily Alerts
ఇంధన సర్చార్జీలను తగ్గించిన ఎస్బీఐ
40 లక్షల మంది ఎస్బీఐ కార్డుదారులకు శుభవార్త. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) అనుబంధంగా పనిచేస్తున్న ఎస్బిఐ కార్డ్.. బుధవారం ఇంధన సర్చార్జీని 2.5 శాతం నుంచి 1
|
40 లక్షల మంది ఎస్బీఐ కార్డుదారులకు శుభవార్త. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) అనుబంధంగా పనిచేస్తున్న ఎస్బిఐ కార్డ్.. బుధవారం ఇంధన సర్చార్జీని 2.5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బిఐ కార్డ్ ఎండి, సిఇఒ విజయ్ జసుజా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 26 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది తెలిసిందే. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్రంగ బ్యాంకులూ ఆ దిశగా పయనిస్తున్నాయి.
ఎస్బీఐ ఖాతాదారులకు ఉపయోగపడే యాప్లు
Comments
English summary