డిజిటల్ వాలెట్ల నుంచే ఫండ్ల కొనుగోలుకు సెబీ అనుమతి
పెట్టుబడిదారులు డిజిటల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఒక ఏడాదిలో రూ. 50 వేల వరకూ విలువైన మ్యూచువల్ ఫండ్ యూనిట్లను డిజిటల్ వాలెట్ ద్వారా కొనుగోలు చేసేందుకు సెబీ ఆమోదం తెలిపింది. మ్యూచువ
మ్యూచువల్ ఫండ్లలో మదుపును సెబీ మరింత సరళతరం చేసింది. ఇకపై పెట్టుబడిదారులు డిజిటల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఒక ఏడాదిలో రూ. 50 వేల వరకూ విలువైన మ్యూచువల్ ఫండ్ యూనిట్లను డిజిటల్ వాలెట్ ద్వారా కొనుగోలు చేసేందుకు సెబీ ఆమోదం తెలిపింది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో సైతం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు సెబీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మరిన్ని పరిణామాలివే.
మన పోర్ట్ఫోలియోలోంచి నిధులను వెనక్కు తీసుకోవాలనుకున్నప్పుడు అంటే రిడీమ్ చేసినప్పుడు మాత్రం అందుకు సంబంధించిన ఖాతాదారు బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తారు. తమ వాలెట్ ద్వారా మ్యూచువల్ ఫండ్లల కొనుగోలును ప్రోత్సహించేందుకు ఈ-వాలెట్ నిర్వాహకులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి క్యాష్బ్యాక్ ఇచ్చేందుకు అనుమతించరు. అయితే క్యాష్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే యూనిట్ల కొనుగోలుకు అనుమతిస్తారు. క్రెడిట్ కార్డులు, క్యాష్ బ్యాక్లు, ఇతర ప్రమోషన్ పథకాల ద్వారా చెల్లింపులను చేసేందుకు వీలు కల్పించరు.