జీఎస్టీ అమలయితే సేవా పన్ను 18%: అధియా
సేవా పన్ను రేటు 18% వరకూ పెరిగే అవకాశం ఉందని భారత ప్రభుత్వం చెప్పింది. ఒకసారి జీఎస్టీ అమలు ప్రారంభమైతే ఎక్కువ సేవలు అందులోకి వస్తాయని సేవా పన్ను రేటు సైతం ప్రస్తుతం ఉన్న 15% నుంచి 18%
సేవా పన్ను రేటు 18% వరకూ పెరిగే అవకాశం ఉందని భారత ప్రభుత్వం చెప్పింది. ఒకసారి జీఎస్టీ అమలు ప్రారంభమైతే ఎక్కువ సేవలు అందులోకి వస్తాయని సేవా పన్ను రేటు సైతం ప్రస్తుతం ఉన్న 15% నుంచి 18%కి పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఏది ఏమైనప్పటికీ సెరీకల్చర్, పూలతోటలు, పండ్ల తోటలు, చేపల పెంపకం వంటి వ్యవసాయదారులు, వ్యవసాయ అనుబంధ రంగాలు, అందులో పనిచేసే వారికి సేవా పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. కొన్ని ప్రత్యేక అంశాలకు సంబంధించి పన్ను అంశాలు కొలిక్కి రాలేదని అధియా అన్నారు. విద్య, వైద్యం, మతరమైన యాత్రలు వీటితో పాటు మరో 57 సేవలు ప్రస్తుతం సేవా పన్ను మినహాయంపు కలిగి ఉన్నాయి. వీటికి సంబంధించి జీఎస్టీ మండలి తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మే 13-18 మధ్య శ్రీనగర్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశమవుతుంది.