For Quick Alerts
For Daily Alerts
26 కంపెనీల ద్వారా 4030 కోట్లా?
ఇష్యూల ద్వారా ఆయా కంపెనీలు 61.9 కోట్ల డాలర్ల (రూ.4,030 కోట్లు) సమీకరించాయని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఐపిఒ ధోరణులపై విడుదల చేసిన నివేదికలో తెలిపింది. రెండు ఎక్స్చేంజీలు నాలుగు సంస్థల ద్వారా మాత్ర
|
యూరప్, పశ్చిమాసియా, భారత, ఆఫ్రికా (ఈంఇఐఎ) ప్రాంతంలో పబ్లిక్ ఇష్యూలు జోరుగా ఉన్న మార్కెట్గా భారతదేశం నిలిచింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో బిఎ్సఇ, ఎన్ఎస్ఇల్లో 26 ఐపిఒలు జారీ అయ్యాయి. ఈ ఇష్యూల ద్వారా ఆయా కంపెనీలు 61.9 కోట్ల డాలర్ల (రూ.4,030 కోట్లు) సమీకరించాయని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఐపిఒ ధోరణులపై విడుదల చేసిన నివేదికలో తెలిపింది. రెండు ఎక్స్చేంజీలు నాలుగు సంస్థల ద్వారా మాత్రమే 57.3 కోట్ల డాలర్ల నిధులను రాబట్టాయని, చిన్న,మధ్య తరహా సంస్థల ప్లాట్ఫామ్ల ద్వారా మరో 24 కంపెనీలు 4కోట్ల 60 లక్షల డాలర్లను సేకరించాయని నివేదిక విశ్లేషించింది. ఐపీవోలో ఆఫర్ డాక్యుమెంట్ అర్థం చేసుకోవడం ఎలా?
ఈంఇఐఎ ప్రాంతంలోని ఎక్సేంజీలు 5.2 బిలియన్ డాలర్ల విలువైన 77 ఐపీవోలను జారీ చేశాయి. ఏడాది ప్రారంభంలో వృద్ది నామమాత్రంగా ఉన్నా, రెండో త్రైమాసికంలో ఐపీవోల దూకుడు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2017లో అంతర్జాతీయ ఐపీవోలు దూసుకెళ్లొచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆసియా-పసిఫిక్లోని ఆర్థిక మార్కెట్లు ఆశించిన దాని కంటే సానుకూలంగా ఉన్నట్లు చెపుతున్నారు.
Comments
English summary