యూపీఐ కోసం ట్రూకాలర్తో జట్టు కట్టిన ఐసీఐసీఐ
ట్రూకాలర్ పే ద్వారా ఏదైనా యూపీఐ ఐడీ లేదా మొబైల్ నంబరుకు డబ్బు పంపించేందుకు వీలవుతుంది. అయితే లబ్దిదారు భీమ్ యాప్లో నమోదయి ఉండాలని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. అంతే కాకుండా వినియోగదారులు త
ట్రూకాలర్ పే పేరుతో సరికొత్త యూపీఐ ఆధారిత చెల్లింపుల సేవ రాబోతోంది. ఈ మేరకు ట్రూకాలర్తో జట్టు కట్టినట్లు దేశీయ అగ్రశ్రేణి ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐ తెలిపింది. ట్రూకాలర్ పే ద్వారా ఏదైనా యూపీఐ ఐడీ లేదా మొబైల్ నంబరుకు డబ్బు పంపించేందుకు వీలవుతుంది. అయితే లబ్దిదారు భీమ్ యాప్లో నమోదయి ఉండాలని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. అంతే కాకుండా వినియోగదారులు తమ మొబైల్లో ఉన్న ట్రూకాలర్ యాప్లోనే రీచార్జీలు సైతం చేసుకోవచ్చని బ్యాంకు చెప్పింది.
ట్రూకాలర్ యాప్లను ఉపయోగించే ఏ యూజరయినా, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారు కాకపోయినప్పటికీ తమ బ్యాంకు ఖాతాను యూపీఐలో లింక్ చేసుకోవచ్చు. సత్వరమే యూపీఐ ఐడీ తయారుచేసుకోవడం ద్వారా చెల్లింపులను సురక్షితంగా జరుపుకోవచ్చు. నూతన భాగస్వామ్యంతో దేశంలో 15 కోట్ల మందితో దేశంలోనే అతిపెద్ద మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థగా ట్రూకాలర్గా నిలవగలదని ఉమ్మడి ప్రకటనలో రెండు సంస్థలు ప్రకటించాయి.