మొబైల్ కనెక్షన్లకు ఆధార్ తప్పనిసరితో రూ. 1000 కోట్ల భారం ఎవరిపైన
టెలికాం నిపుణుల విశ్లేషణ ప్రకారం ఆధార్ ఆధారిత మొబైల్ కనెక్షన్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయడంతో టెలికాం కంపెనీలపై రూ. 1000 కోట్ల వరకూ భారం పడనుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి రీవెర
టెలికాం నిపుణుల విశ్లేషణ ప్రకారం ఆధార్ ఆధారిత మొబైల్ కనెక్షన్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయడంతో టెలికాం కంపెనీలపై రూ. 1000 కోట్ల వరకూ భారం పడనుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి రీవెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉందని కొన్ని టెలికాం సంస్థల యాజమాన్యాలు అంటున్నాయి.
ఇందుకోసం తాము పత్రికలు,టీవీల్లో, డిజిటల్ ప్రకటనలు ఇచ్చి కొత్త నిబంధన గురించి ప్రజలను అందుకు సమాయత్తం చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. అంతే కాకుండా లక్షలాదిగా బయోమెట్రిక్ పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి చేసే వెరిఫికేషన్ ప్రక్రియ ఆధార్తో కూడిన బమోమెట్రిక్ ఈ-కేవైసీ తరహాలో ఉంటుంది. ఇందులో భాగంగా టెలికాం సంస్థల ప్రతినిధులే మారుమూల గ్రామాలను సందర్శించాలి. ఈ వ్యవహారంపై సెల్యూలార్ ఆపరేటర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ మాట్లాడుతూ "ఇది పరిశ్రమకు ఖర్చుతో కూడిన వ్యవహారం. దీని వల్ల టెలికాం సంస్థలపై ప్రతినిధుల శిక్షణ, పరికరాల కోసం రూ. 1000 కోట్ల వరకూ భారం పడుతుంద"ని చెప్పారు.