For Quick Alerts
For Daily Alerts
188 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
సెన్సెక్స్లో బాగా నష్టపోయిన వాటిలో టాటా స్టీల్(3.15%), రిలయన్స్(2.76%), ఏసియన్ పెయింట్స్(2.07%), కోల్ ఇండియా(2.06%), విప్రో(1.77%) ముందు ఉండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా((+1.2%), పవర్ గ్ర
|
అమెరికాలో ఒబామా హెల్త్ కేర్ సిస్టమ్ను తొలగించిన తర్వాత సరైన రీతిలో ట్రంప్ ఆ వ్యవస్థను నెలకొల్పుతాడో లేదో అన్న అనుమానాలతో ప్రపంచ మార్కెట్లు భయాందోళనకు గురయ్యాయి. ఒక పక్క పన్ను తగ్గింపులు చేసి మరో వైపు ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని ఎలా నెలకొల్పుతాడో అన్న సంశయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. దీంతో దేశీయ మార్కెట్లు సైతం ఈ రోజు నష్టాల్లో పయనించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 188 పాయింట్లు(0.64%) నష్టపోయి 29233 వద్ద ముగియగా ; మరో సూచీ నిఫ్టీ 63 పాయింట్లు(0.69%) క్షీణించి 9045 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్లో బాగా నష్టపోయిన వాటిలో టాటా స్టీల్(3.15%), రిలయన్స్(2.76%), ఏసియన్ పెయింట్స్(2.07%), కోల్ ఇండియా(2.06%), విప్రో(1.77%) ముందు ఉండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా((+1.2%), పవర్ గ్రిడ్ (0.88%), హెచ్డీఎప్సీ(0.87%), డాక్టర్ రెడ్డీస్(0.59%), ఐటీసీ(03%) లాభపడ్డాయి.
Comments
English summary
188 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ | sensex ended with nearly 190 points loss
Story first published: Monday, March 27, 2017, 16:35 [IST]