మార్చి 31 లోపు నల్లధనం డిపాజిట్ చేయండి:ఐటీ శాఖ
గడువు లోపు పీఎంజీకేవై కింద నల్లధనాన్ని డిపాజిట్ చేయకపోతే అక్రమ డిపాజిట్లను చేసిన వారికి భారీగా పెనాల్టీలను విధిస్తామని ఆదాయపు పన్ను శాఖ కఠిన హెచ్చరికలను జారీచేసింది.
నల్లధనం వెల్లడికి చివరి తేది మార్చి 31 సమీపిస్తుండటంతో కేంద్రం ప్రకటించిన పథకాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఐటీ శాఖ మరోసారి గుర్తుచేసింది. దీంతో కేంద్రప్రభుత్వం, ఆదాయపన్ను శాఖలు 'డెడ్ లైన్' లోపు పన్ను చెల్లించకపోతే నల్లధనం కల్గి ఉన్నవారు తర్వాత చాలా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించాయి. ఈ మేరకు జాతీయ స్థాయిలో మీడియాలో నిర్ణిత గడువులోపు పన్ను చెల్లించాలని ప్రకటనలను సైతం జారీ చేస్తున్నారు.
నల్లధనం కుబేరులు పన్ను చెల్లించడానికి మార్చి 31న చివరి తేదిగా నిర్ణయించిన కేంద్రం..ఇందుకోసం 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై)' అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. నిర్ణిత గడువులోగా పన్ను చెల్లించేవారు వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆదాయపన్ను (ఐటీ)శాఖ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గడువు లోపు పీఎంజీకేవై కింద నల్లధనాన్ని డిపాజిట్ చేయకపోతే అక్రమ డిపాజిట్లను చేసిన వారికి భారీగా పెనాల్టీలను విధిస్తామని ఆదాయపు పన్ను శాఖ కఠిన హెచ్చరికలను జారీచేసింది. నల్లధనాన్ని ఈ విధంగా సక్రమ ధనంగా మార్చేశారా?