1.9 రెట్లు సబ్స్క్రైబ్ అయిన సీఎల్ ఎడ్యుకేట్
విద్యా సంబంధ సేవల సంస్థ సీఎల్ ఎడ్యుకేట్ పబ్లిక్ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 500-502కాగా.. బుధవారం ముగిసింది. చివరి రోజుకి కేవలం 1.9 రెట్లు మాత్రమే బిడ్
విద్యా సంబంధ సేవల సంస్థ సీఎల్ ఎడ్యుకేట్ పబ్లిక్ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 500-502కాగా.. బుధవారం ముగిసింది. చివరి రోజుకి కేవలం 1.9 రెట్లు బిడ్స్ దాఖలయ్యాయి.
రూ. 239 కోట్ల సమీకరణకు కంపెనీ పబ్లిక్ ఇష్యూకి రాగా.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్) కోటాలో 3.66 రెట్లు అధికంగా బిడ్స్ లభించగా.. సంపన్న వర్గాల(హెచ్ఎన్ఐలు) నుంచి 21 శాతమే దరఖాస్తులు వచ్చాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచి 1.6 రెట్లు అధిక బిడ్స్ దాఖలు కావడం గమనించదగ్గ విషయం. డీమార్ట్(ఎవెన్యూ సూపర్మార్ట్స్) ఐపీవో సూపర్ సక్సెస్ నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్పట్ల రిటైలర్ల ఆసక్తి పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.ఇష్యూ ప్రారంభానికి ముందురోజు కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 72 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. సీఎల్ ఎడ్యుకేట్ గజా క్యాపిటల్ ఈక్విటీ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఐఐటీ-ఐఐఎమ్ పూర్వ విద్యార్థులు గత 20 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నిర్వహిస్తున్నారు.