ఐటీ రిటర్నులకు ఆధార్, నగదు లావాదేవీలు రూ. 2 లక్షల వరకే
ఆదాయపు పన్ను రిటర్నులు, పాన్ దరఖాస్తు చేయాలన్నా ఆధార్ తప్పనిసరి అయ్యే రోజులు ఇక ఎంతో దూరంలో లేవు. ఎందుకంటే పలు చోట్ల వీటిని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది. అం
ఆదాయపు పన్ను రిటర్నులు, పాన్ దరఖాస్తు చేయాలన్నా ఆధార్ తప్పనిసరి అయ్యే రోజులు ఇక ఎంతో దూరంలో లేవు. ఎందుకంటే పలు చోట్ల వీటిని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది. అంతే కాదు నగదు చెల్లింపులు కేవలం రెండు లక్షల రూపాయలకే పరిమితం కానున్నాయి. అంతకుమించి చెల్లించాలంటే ఆన్లైన్ లావాదేవీలు తప్పవు. జూలై ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. జూలై ఒకటో తేదీకి పాన్ కార్డు ఉన్నవాళ్లు.. తమ ఆధార్ నంబరును ఆదాయ పన్ను శాఖకు తెలియజేయాల్సిందే! రాజకీయ పార్టీల ట్రస్టులకు విరాళాలు కేవలం చెక్కులు ఇవ్వాల్సిందే! మిగిలిన రూపాల్లో చెల్లింపులు నిషేధం!
నల్ల ధనంపై పోరాటంలో భాగంగా ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజా నిబంధనలను సిద్ధం చేసింది. ఆర్థిక బిల్లు-2017 లో భాగంగా లోక్సభలో అరుణ్ జైట్లీ సవరణలను ప్రతిపాదించనున్నారు. ఒకసారి కొత్త ప్రతిపాదనలు చట్టరూపం దాల్చితే పన్ను చెల్లింపుదారులంతా ఐటీ రిటర్నులు సమర్పించేటప్పుడు బయోమెట్రిక్ సహిత ఆధార్ను ఐటీ శాఖకు ఇవ్వాల్సిందే. అంటే 12 అంకెల ఆధార్ సంఖ్యతో పాటు దాన్ని సపోర్ట్ చేసే విధంగా వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ ద్వారా కంటి పాప బొమ్మ వంటి వాటిని తీసుకుంటారు.