27 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
వరుసగా రెండు సెషన్లు నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ ఈ రోజు స్వల్ప లాభాలతో ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సూచీలకు జోష్నిచ్చాయి. రోజు మొత్తం నష్టాల మధ్యే కదిలిన మార్కెట్లు చివరికి నామమాత్ర లాభ
వరుసగా రెండు సెషన్లు నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ ఈ రోజు స్వల్ప లాభాలతో ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సూచీలకు జోష్నిచ్చాయి. రోజు మొత్తం నష్టాల మధ్యే కదిలిన మార్కెట్లు చివరికి నామమాత్ర లాభంతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 27 పాయింట్లు పెరిగి 28,929 వద్ద నిలవగా.. నిఫ్టీ 3 పాయింట్లు బలపడి 8,927 వద్ద స్థిరపడింది. ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ పెంపు ఆందోళనల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 28,986-28,815 పాయింట్ల మధ్య ఊగిసలాడి.. నిఫ్టీ 8945 వద్ద గరిష్టాన్నీ, 8899 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది.
ఈ రోజు బాగా లాభపడిన వాటిలో ఎస్బీఐ, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఏషియన్ పేయింట్స్ ఉండగా... డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, విప్రో, గెయిల్, టాటా స్టీల్ నష్టాలకు గురయ్యాయి.