For Quick Alerts
For Daily Alerts
ఉచిత గ్యాస్ సబ్సిడీకి సైతం ఆధార్ తప్పనిసరి
ఇకపై ఉచిత గ్యాస్ సబ్సిడీని పొందేందుకు ఆధార్ వివరాలు తప్పక ఇవ్వాల్సిందే.దారిద్ర్యరేఖకు దిగువ ఉన్న మహిళలంతా ఆధార్ వివరాలను మే31 లోపు సమర్పించాల్సిందేనని కేంద్రం వెల్లడించింది.గతేడాది పహ
|
ఇకపై ఉచిత గ్యాస్ సబ్సిడీని పొందేందుకు ఆధార్ వివరాలు తప్పక ఇవ్వాల్సిందే. దారిద్ర్యరేఖకు దిగువ ఉన్న మహిళలంతా ఆధార్ వివరాలను మే31 లోపు సమర్పించాల్సిందేనని కేంద్రం వెల్లడించింది. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందాలంటే వారంతా గడువు లోపు ఆధార్ కోసం ఎన్రోల్ చేసుకోవాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గత ఏడాది పహల్ పథకం కింద సబ్సిడీ సిలిండర్లను పొందాంటేనే ఆధార్ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
గత వారం రోజులుగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ను తప్పనిసరి చేస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకానికి అర్హులుగా ఉన్న వారు సైతం ఆధార్ సమర్పించేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కింద కేంద్రం ఇప్పటికే 1.67 కోట్ల కొత్త గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేసింది. దేశవ్యాప్తంగా ధనవంతులు(అధిక ఆదాయ వర్గాల వారు) స్వచ్చందంగా గ్యాస్ సబ్సిడీని వదులుకోవడంతో ఆ ప్రయోజనాలన్నీ కింది స్థాయి వర్గాలకు బదలాయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్ని చేస్తున్నా ఇప్పటికీ గ్రామాల్లో కొంత మంది గ్యాస్ వాడకుండా కట్టెల పొయ్యి వాడుతుండటంతో కేంద్రం దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ గ్యాస్ ఉండేలా చూసేందుకు పలు చర్యలను చేపడుతోంది. అయితే ఇక్కడ అక్రమాలు చోటుచేసుకునే వీలుండటంతో ఆధార్ సాయంతో లబ్దిదారులకు మేలు జరిగేలా, పథకం ద్వారా అనర్హులను కట్టడి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
Comments
English summary
ఉచిత గ్యాస్ సబ్సిడీకి సైతం ఆధార్ తప్పనిసరి | Aadhaar is now must for free LPG connection under PMUY scheme
Story first published: Wednesday, March 8, 2017, 15:45 [IST]