For Quick Alerts
For Daily Alerts
49 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
మునుపటి సెషన్లో 0.7శాతం లాభపడిన సూచీలు మంగళవారం నష్టాల్లో పయనించాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు ఈ వారం కన్సాలిడేషన్ చోటుచేసుకునే అవకాశం ఉందన్న విశ్లేషకుల అంచనాలతో
|
మునుపటి సెషన్లో 0.7శాతం లాభపడిన సూచీలు మంగళవారం నష్టాల్లో పయనించాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు ఈ వారం కన్సాలిడేషన్ చోటుచేసుకునే అవకాశం ఉందన్న విశ్లేషకుల అంచనాలతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో సెన్సెక్స్ 48.63పాయింట్లు(0.17%) నష్టపోయి 28,999.56 వద్ద ముగియగా; నిఫ్టీ 17 పాయింట్లు(0.18%) క్షీణించి 8947 వద్ద స్థిరపడింది.
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు రెండేళ్ల గరిష్టానికి చేరడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు, ప్రపంచ మార్కెట్ల బలహీనతలు వంటి అంశాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు చెప్పారు. దీంతో నేటి ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించినట్లు అంచనా వేస్తున్నారు. నిప్టీ సెంటిమెంటు పాయింటు 9 వేల మార్కును దాటలేకపోయింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారు పాటించాల్సిన సూచనలు
బీఎస్ఈ సెన్సెక్స్లో లాభపడిన వాటిలో డెల్టాకార్ప్, జస్ట్డయల్, అదానీపవర్, కేఎస్సీఎల్,మైండ్ట్రీ ముందుండగా; నష్టపోయిన వాటిలో ఆర్కామ్, హిందాల్కో, హిందుస్థాన్జింక్, జేకేటైర్,సెయిల్ ఉన్నాయి.
Comments
English summary