రిలయన్స్ జోష్తో 5 నెలల గరిష్టానికి సెన్సెక్స్
గత 8 ఏళ్లలో లేనివిధంగా ముకేష్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 11 శాతం దూసుకెళ్లడంతో మార్కెట్లకు ఒక్కసారిగా జోష్ వచ్చింది. దీంతో దేశీయ మార్కెట్లు సుమారు ఆరు నెలల గరిష్టం వద్ద ముగిశాయి. ట్రేడిం
100
పాయింట్లకు
పైగా
లాభాల్లో
ముగిసిన
సెన్సెక్స్
గత
8
ఏళ్లలో
లేనివిధంగా
ముకేష్
అంబానీ
దిగ్గజం
రిలయన్స్
ఇండస్ట్రీస్
11
శాతం
దూసుకెళ్లడంతో
మార్కెట్లకు
ఒక్కసారిగా
జోష్
వచ్చింది.
దీంతో
దేశీయ
మార్కెట్లు
సుమారు
ఆరు
నెలల
గరిష్టం
వద్ద
ముగిశాయి.
ట్రేడింగ్
ముగిసేసరికి
సెన్సెక్స్
103
పాయింట్లు
పెరిగి
28,865కు
చేరుకోగా,
నిఫ్టీ
19
పాయింట్లు
బలపడి
8,927
వద్ద
స్థిరపడింది.
2009
మే
18
తరువాత
ఇండెక్స్
హెవీవెయిట్
ఆర్ఐఎల్
10
శాతంపైగా
జంప్చేయగా..
ఈ
కౌంటర్లో
గత
ఏడేళ్లలోలేని
విధంగా
భారీ
ట్రేడింగ్
పరిమాణం
మళ్లీ
ఈ
రోజే
నమోదైంది.
వెరసి
రూ.
1200కు
ఎగువన
ముగియడం
ద్వారా
9
ఏళ్ల
గరిష్టానికి
చేరింది.
దీంతో
ఆర్ఐఎల్
మార్కెట్
విలువ
రూ.
25,000
కోట్లకుపైగా
ఎగసి
రూ.
3.91
లక్షల
కోట్లను
తాకింది.
తద్వారా
మార్కెట్
విలువలో
టీసీఎస్
తర్వాత
రెండో
స్థానంలో
నిలిచింది.
ఫలితంగా
హెచ్డీఎఫ్సీ
బ్యాంకును
వెనక్కి
నెట్టింది.
బీఎస్ఈలో రంగాల వారీ చూస్తే చమురు, సహజ వాయు రంగం 1.77%, బ్యాంకింగ్ 0.24% లాభపడగా; ఐటీ(1.69%), కన్సూమర్ డ్యూరబుల్స్(1.35%), టెక్నాలజీ(1.3%), విద్యుత్-పవర్(1.28%) రంగాలు నష్టపోయాయి.
సెన్సెక్స్ టాప్ గెయినర్లలో రిలయన్స్(10.97%), యాక్సిస్ బ్యాంకు(3.93%), ఏసియన్ పెయింట్స్(2.92%), కోల్ ఇండియా(2.63%), హీరో మోటోకార్ప్(1.16%) లాభాపడగా; నష్టపోయిన వాటిలో ఎన్టీపీసీ(3.36%), టీసీఎస్(2.22%), పవర్ గ్రిడ్(2.19%), ఇన్ఫోసిస్(2.08%), టాటా స్టీల్(1.49%) ముందు ఉన్నాయి.