స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 100 పాయింట్ల మేర, నిఫ్టీ 8800 పైకి ఎగిసింది. అయితే ఒక్కసారిగా మార్కెట్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో లాభాలు తగ్గుముఖం ప
ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 100 పాయింట్ల మేర, నిఫ్టీ 8800 పైకి ఎగిసింది. అయితే ఒక్కసారిగా మార్కెట్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో లాభాలు తగ్గుముఖం పట్టాయి. చివరికి బీఎస్ఈ సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 28,351.62 వద్ద ముగిసింది. నిఫ్టీ 11.50 పాయింట్లు పైకి ఎగబాకి 8,805.05 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల సయ్యాల మధ్య మార్కెట్లు స్వల్పంగా బలపడినప్పటికీ చిన్న షేర్లలో అమ్మకాలు నమోదయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించగా.. స్మాల్ క్యాప్ 0.6 శాతం నీరసించింది. మొత్తం ట్రేడైన షేర్లలో 1787 నష్టపోతే.. 1082 మాత్రమే లాభపడ్డాయి. మిడ్ క్యాప్స్లో ఎక్సైడ్, పిరమల్, భారత్ ఫో్ర్జ్, నాల్కో, ఐబీ హౌసింగ్, టాటా పవర్ 4-2 శాతం మధ్య పుంజుకోగా.. స్మాల్ క్యాప్స్లో శ్రేయాస్ 20 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో రుచీ సోయా, వెంకీస్, ఎన్ఎఫ్ఎల్, గ్రీన్ప్లై, డీలింక్, ఆర్కోటెక్, ఎంసీఎక్స్, ఐఎల్ఎఫ్ఎస్ ఇంజినీరింగ్, ఎంఎస్ఆర్ తదితరాలు 16-5 శాతం మధ్య పైకి ఎగశాయి.