జన్ధన్ డిపాజిట్లలో దేశంలో కర్ణాటక నంబర్ 2
పెద్ద నోట్ల మార్పిడి నిర్ణయం తర్వాత బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు వెల్లువెత్తాయి. అయితే ఏ రాష్ట్రంలో డిపాజిట్లు ఎక్కువయ్యాయనే విషయంలో అందరికీ ఆసక్తి ఉంటుంది. జన్ధన్ డిపాజిట్లకు సంబంధించి ప్ర
పెద్ద నోట్ల మార్పిడి నిర్ణయం తర్వాత బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు వెల్లువెత్తాయి. అయితే ఏ రాష్ట్రంలో డిపాజిట్లు ఎక్కువయ్యాయనే విషయంలో అందరికీ ఆసక్తి ఉంటుంది. జన్ధన్ డిపాజిట్లకు సంబంధించి ప్రభుత్వం, ఆర్బీఐ వివరాలను సేకరిస్తున్నాయి. ఐటీ శాఖ సైతం అనుమానస్పద లావాదేవీలపై దృష్టి సారించింది. మొత్తం ఆయా ఖాతాల్లో డిపాజిట్ల విషయంలో గుజరాత్ ప్రథమ స్థానంలో ఉండగా కర్ణాటక రూ. 1156 కోట్ల డిపాజిట్లతో రెండవ స్థానంలో ఉంది. ఈ డిపాజిట్లలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.
జన్ధన్ యోజన ఖాతా వల్ల కలిగే ప్రయోజనాలు
పెద్ద నోట్ల మార్పిడికి ముందు జన్ ధన్ ఖాతాల్లో నవంబరు 9న రూ. 1412 కోట్లుండగా జనవరి 25 తర్వాత ఇది ఏకంగా రూ. 2568.76 కోట్లకు పెరగడం అనుమానాలకు తావిస్తోంది. అంటే దాదాపు డిపాజిట్లలో 82 శాతం అనూహ్యమైన పెరుగుదల ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు కొంత మందికి నోటీసులు జారీ చేశారు. చాలా మందికి మెయిల్స్, సంక్షిప్త సందేశాలను పంపుతున్నారు. పొదుపు మొత్తాలను జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్ చేసి ఉంటే అలాంటి ఖాతాదార్లను వేధించొద్దని ప్రభుత్వం నుంచి అధికారులకు సూచనలు అందినట్లు సమచారం.