లోహ, ప్రభుత్వ రంగ షేర్ల రాణింపుతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
లోహ, చమురు, సహజవాయు, స్థిరాస్తి రంగ షేర్లు రాణించడంతో దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 83(0.31%) పాయింట్లు పుంజుకుని 27,117 స్థాయిని చేరుకోగా... నిఫ్టీ 42 పాయింట్లు బలపడి 8,391 వద్ద
లోహ, చమురు, సహజవాయు, స్థిరాస్తి రంగ షేర్లు రాణించడంతో దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 83(0.31%) పాయింట్లు పుంజుకుని 27,117 స్థాయిని చేరుకోగా... నిఫ్టీ 42 పాయింట్లు బలపడి 8,391 వద్ద స్థిరపడింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 8,400కు చేరువలో ముగియడం సెంటిమెంటును బలపరిచింది. ఇందుకు ప్రధానంగా మరో వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న బడ్జెట్పై ఆశలే కారణమైనట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే జనవరి డెరివేటివ్స్ బుధవారం ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు కొంతమేర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశమున్నదని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో గత వారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఒక్కరోజు దేశీయ మార్కెట్లు దాదాపు 270 పాయింట్ల మేర నష్టపోయాయి. 2017-18 బడ్జెట్ నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో మార్కెట్లు పెద్దగా కుదుపునకు గురికాలేదు.
బీఎస్ఈ సెన్సెక్స్లో లాభపడిన వాటిలో బీఈఎంఎల్(6.40%), యునైటెడ్ స్పిరిట్స్(6.02%), హిందాల్కో(5.75%), శ్రేయి ఇన్ఫ్రా(5.73%), సెయిల్(5.15%) ఉండగా; నష్టపోయిన వాటిలో పీఈఎల్(4.15%), దివీస్ ల్యాబ్(3.75%), అమర్రాజాబ్యాటరీస్(3.34%), జేఎస్డబ్ల్యూ ఎనర్జీ(3.10%), నాట్కోఫార్మా(2.95%) ముందు ఉన్నాయి.