For Quick Alerts
For Daily Alerts
22 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్
దేశీయ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. కార్పొరేట్ సంస్థల ఫలితాల ప్రకటనలతో పాటు, బ్యాంకుల త్రైమాసిక ఫలితాలకు సమయం ఆసన్నం కావడంతో మార్కెట్లు ఉత్సాహంతో ముందుకెళుతున్నాయి. బీఎస్ఈ సె
|
దేశీయ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. కార్పొరేట్ సంస్థల ఫలితాల ప్రకటనలతో పాటు, బ్యాంకుల త్రైమాసిక ఫలితాలకు సమయం ఆసన్నం కావడంతో మార్కెట్లు ఉత్సాహంతో ముందుకెళుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు 21.98(0.08%) పాయింట్ల లాభంతో 27257 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల(0.23%) లాభంతో 8417 వద్ద ముగిశాయి.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(2.27%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.71%), మూలధన వస్తువుల రంగం(0.63%), బ్యాంకింగ్(53%) లాభపడ్డాయి. మరో వైపు చమురు, సహజ వాయు రంగం(2.1%), టెక్నాలజీ(0.02%), పీఎస్యూ(0.01%) నష్టపోయాయి.
సెన్సెక్స్ టాప్ గెయినర్లలో టాటా స్టీల్(2.95%), హెచ్యూఎల్(2.86%), ఓఎన్జీసీ(1.51%), ఎమ్ అండ్ ఎమ్(0.87%), టీసీఎస్(0.76%) ఉండగా; ఎన్టీపీసీ(1.65%), గెయిల్(1.37%), హీరో మోటోకార్ప్(1.37%), భారతీ ఎయిర్టెల్(1.21%) బజాజ్ ఆటో(0.94%) నష్టాలతో ముగిశాయి.
Comments
English summary
22 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్ | markets ended marginally higher, metal stocks outperform
Story first published: Wednesday, January 18, 2017, 17:46 [IST]