50 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్
సాఫ్ట్వేర్ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ రెవెన్యూ అంచనాలను తగ్గించిన కారణంగా బలహీడపడిన ఐటీ స్టాక్లు ఈరోజు నష్టాల్లో నడిచాయి. ఎన్ఎస్ఈ 12.45 పాయింట్(0.15%)ల లాభంతో 8412.80 వద్ద, బీఎస్ఈ 50
సోమవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఐటీ కంపెనీల ఫలితాల్లో సానుకూల ధోరణితో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లకు డిమాండ్ ఏర్పడటం సూచీలకు కలిసొచ్చింది. సాఫ్ట్వేర్ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ రెవెన్యూ అంచనాలను తగ్గించిన కారణంగా బలహీడపడిన ఐటీ స్టాక్లు ఈరోజు నష్టాల్లో నడిచాయి. ఎన్ఎస్ఈ 12.45 పాయింట్(0.15%)ల లాభంతో 8412.80 వద్ద, బీఎస్ఈ 50 పాయింట్ల లాభంతో 27288 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే, స్థిరాస్తి రంగం(1.61%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.99%), బ్యాంకింగ్(0.98%), లోహ రంగం(0.97%) దూసుకెళ్లాయి. మరో వైపు ఐటీ రంగం 1.02% నష్టపోగా, టెక్నాలజీ(0.81%), చమురు, సహజ వాయు రంగం(0.37%), హెల్త్ కేర్(0.08%) మేర క్షీణించాయి.
టాప్ గెయినర్లలో టాటా స్టీల్(2.69%), టాటా మోటార్స్(2.31%), అదానీ పోర్ట్స్(2.11%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(1.93%), హీరో మాటోకార్ప్(1.54%) ఉండగా; ఇన్ఫోసిస్(1.99%), ఓఎన్జీసీ(1.32%), రిలయన్స్(1.21%), సన్ఫార్మా(1.17%), గెయిల్(0.92%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.