మర్చంట్ డిస్కౌంట్ చార్జీలు(ఎండీర్) రద్దు చేసిన ఎస్బీఐ
కార్డు లావాదేవీలకు అయ్యే ఖర్చును ఎవరు భరించాలనే దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారులకు స్వాంతన చేకూర్చేలా ఎస్బీఐ ముందడుగు వేసింది. వార్షిక టర్నోవర్ రూ. 20 లక్షల
డిజిటల్ లావాదేవీలకు ఆసక్తి పెరిగేలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశమంతా డిజిటల్ బాట పడుతున్న తరుణంలో కార్డు లావాదేవీలకు అయ్యే ఖర్చును ఎవరు భరించాలనే దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారులకు స్వాంతన చేకూర్చేలా ఎస్బీఐ ముందడుగు వేసింది. వార్షిక టర్నోవర్ రూ. 20 లక్షల వరకూ ఉన్న చిన్న వ్యాపారులకు ఈ ఏడాది చివరి వరకూ (31 డిసెంబర్ 2017)డెబిట్ కార్డు లావాదేవీలపై (మర్చంట్ డిస్కౌంట్ రేట్- ఎండీఆర్) చార్జీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
కార్డు చెల్లింపుల వల్ల ప్రయోజనాలు చిన్న వ్యాపారులకు అందుబాటులోకి తేవడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలోతెలిపింది. ప్రభుత్వ డిజిటల్ కార్యక్రమాలకు మద్దతుగా తనవంతు కృషికి కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు పేర్కొంది. దేశంలో మెట్రో నగరాల నుంచి గ్రామాల వరకూ పీఓఎస్ ఆమోదిత మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది.
ఎస్బీఐ ఖాతాదారులకు ఉపయోగపడే యాప్లు