173 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్: 2 నెలల గరిష్టానికి
మునుపటి రెండు రోజుల నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు లాభపడి మదుపర్లకు జోష్నిచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 173 పాయింట్లు పెరిగి 26,900 వద్ద నిలవగా, ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 53 పాయింట్లు ఎగసి
మునుపటి రెండు రోజుల నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు లాభపడి మదుపర్లకు జోష్నిచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 173 పాయింట్లు పెరిగి 26,900 వద్ద నిలవగా, ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 53 పాయింట్లు ఎగసి 8,289 వద్ద స్థిరపడింది. ఇది రెండు నెలల గరిష్టంకాగా, ఎన్ఎస్ఈలో రియల్టీ(0.3 శాతం) మినహా అన్నిరంగాలూ పురోగమించాయి.
స్టాక్ మార్కెట్లు ఉదయం ఉత్సాహంగా మొదలయ్యాయి. మదుపర్లు ట్రేడింగ్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి తికనబరచడం, అంతర్జాతీయంగా పరిణామాలు సానుకూలంగా ఉండటం వంటి అంశాలు మార్కెట్లో ఉత్సాహాన్ని పెంచాయి. మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ 0.7 నుంచి 1.5 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ రెండు రోజులుగా కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీ మార్కెట్లలో ట్రేడర్లు కొత్త లావాదేవీలు జరిపేందుకు ఆసక్తి చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క దేశీ ఫండ్స్ భారీ పెట్టుబడులు కూడా సెంటిమెంటు పెరిగేందుకు దోహదం చేసినట్లు చెప్పారు.
పీఎఫ్ యూఏఎన్ ఖాతాకు ఆధార్ను అనుసంధానం చేశారా?