For Quick Alerts
For Daily Alerts
ఫిబ్రవరి చివరకల్లా సాధారణ స్థితికి నగదు సరఫరా : ఎస్బీఐ నివేదిక
ఫిబ్రవరి చివరి నాటికి నగదు చలామణీ సాధారణ స్థితికి రాగలదని ఎస్బీఐ పరిశోధనా నివేదిక వెల్లడించింది. డిసెంబరు ఆఖరు నాటికి రద్దు చేసిన వాటికి బదులుగా కేవలం 44% కరెన్సీని మాత్రమే తిరి
|
గత రెండు నెలలుగా నగదు కొరతతో సతమతమవుతున్న సామాన్యులకు స్వాంతన చేకూర్చే వార్త ఇది. ఫిబ్రవరి చివరి నాటికి నగదు చలామణీ సాధారణ స్థితికి రాగలదని ఎస్బీఐ పరిశోధనా నివేదిక వెల్లడించింది. డిసెంబరు ఆఖరు నాటికి రద్దు చేసిన వాటికి బదులుగా కేవలం 44% కరెన్సీని మాత్రమే తిరిగి ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టినట్లు ఆర్బీఐ ఇదివరకే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఎకోవ్రాప్ వెల్లడించిన నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆన్లైన్లో పీపీఎఫ్ సౌకర్యాన్ని అందిస్తున్న బ్యాంకులు
"ప్రస్తుతం జరుగుతున్న విధంగానే నోట్ల ముద్రణ కొనసాగితే జనవరి చివరికల్లా 67 శాతం కరెన్సీని తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టవచ్చు. ఇంతకుముందు అంచనా ప్రకారం ఇది 75%గా ఉంది. అదే ఫిబ్రవరి నాటికి 89 శాతం కరెన్సీ ముద్రణ పూర్తవగలదు." అని ఎస్బీఐ నివేదిక పేర్కొంది.
Comments
English summary