రూ.2000 లోపు లావాదేవీలకు ఓటీపీ అక్కర్లేదు: ఆర్బీఐ
నగదు రహిత లావాదేవీలు నిర్వహించే ఔత్సాహికులకు కాస్త స్వాంతన చేకూర్చే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తీసుకుంది. రూ. 2 వేల లోపు జరిపే డిజిటల్ లావాదేవీలకు రెండంచెల వెరిఫికేషన్ విధానాన్న
నగదు రహిత లావాదేవీలు నిర్వహించే ఔత్సాహికులకు కాస్త స్వాంతన చేకూర్చే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తీసుకుంది. రూ. 2 వేల లోపు జరిపే డిజిటల్ లావాదేవీలకు రెండంచెల వెరిఫికేషన్ విధానాన్ని మినహాయిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇప్పటి నుంచి రూ. 2 వేల లోపు జరిగే ఆన్లైన్ లావాదేవీలకు ఓటీపీ అవసరం ఉండదు.
ఉద్యోగంతో
పాటు
అదనపు
ఆదాయానికి
8
మార్గాలు
ప్రస్తుతం సాధారణంగా ఏదైనా వెబ్సైట్లో షాపింగ్ చేసి చెల్లింపులు చేసేటప్పుడు నెట్బ్యాంకింగ్లో కానీ, కార్డు పేమెంట్ సమయంలో కానీ మొబైల్కు ఓటీపీ వస్తున్న విషయం మీకు తెలిసిందే. ప్రతిసారీ ఓటీపీ ఎంటర్ చేయడం కాస్త శ్రమతో కూడిన వ్యవహారంగా భావించి, ఖాతాదారులు ఫిర్యాదులు చేస్తుండటంతో ఆర్బీఐ దానిపై కాస్త వెసులుబాటు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీంతో ఇప్పటి నుంచి రూ. 2 వేల లోపు జరిపే ఆన్లైన్ లావాదేవీలకు ఓటీపీ లేకుండా చేసుకునే వీలు కలిగింది.
ఇది కూడా చదవండి ఆధార్ అనుసంధానం చేయకపోతే ఇవి కోల్పోతారు