కాన్పూర్ ఐఐటీ విద్యార్థికి మైక్రోసాఫ్ట్ రూ. కోటి ఆఫర్
దేశంలో ఐటీకి ఉన్న దన్ను ఈ నాటిదే కాదు. ఐఐటీ, కాన్పూర్కు చెందిన ఒక విద్యార్థిని ఉద్యోగంలో చేర్చుకునేందుకు మైక్రోసాఫ్ట్ రూ. 1.50 కోటి ఆఫర్ చేయడంతో ఈ విషయం మరోసారి రుజువైంది. ఎన్నో సంవత్సరాల నుంచి
దేశంలో ఐటీకి ఉన్న దన్ను ఈ నాటిదే కాదు. ఐఐటీ, కాన్పూర్కు చెందిన ఒక విద్యార్థిని ఉద్యోగంలో చేర్చుకునేందుకు మైక్రోసాఫ్ట్ రూ. 1.50 కోటి ఆఫర్ చేయడంతో ఈ విషయం మరోసారి రుజువైంది. ఎన్నో సంవత్సరాల నుంచి దేశ ఇంజినీరింగ్ యువత తమ సాఫ్ట్వేర్ నైపుణ్యాలతో దూసుకెళుతున్నారు. అందుకే అమెరికన్ ఐటీ కంపెనీలు మన ఐఐటీ విద్యార్థులకు అత్యధిక ప్యాకేజీలను ఇవ్వజూపుతున్నాయి. ఒక పక్క డొనాల్డ్ ట్రంప్ అవుట్ సోర్సింగ్ మీద విషం కక్కుతున్న ఈ సందర్భంలో దేశ ఐటీ సత్తాను చాటుతున్న యువతను మెచ్చుకోవాల్సిందే. ఉద్యోగం దక్కించుకున్న విద్యార్థి స్వస్థలం ఢిల్లీ. జాబ్ లొకేషన్ మైక్రోసాఫ్ట్ కేంద్ర కార్యాలయం రెడ్మాండ్లో ఉండొచ్చని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి ప్రపంచంలో 10 సంపన్న నగరాలు
సదరు విద్యార్థికి బేసిక్ పే రూ. 94.00 లక్షలు, రిలోకేషన్, మెడికల్, వీసా చార్జీలు, స్టాక్ ఓనర్షిప్ ఆప్షన్లు అన్నీ కలిపి అదనంగా రూ. 70 వేల వరకూ రావొచ్చని తెలుస్తోంది. గతేడాది ఐఐటీ కాన్పూర్లో అత్యధిక వేతనం అందుకున్న విద్యార్థి బేసిక్ పే రూ. 93 లక్షల వరకూ ఉంది.