For Quick Alerts
For Daily Alerts
118 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్
దేశీయ మార్కెట్లు 0.5 శాతానికి పైగా లాభాలతో దూసుకెళ్లాయి. వాహన, లోహ, ఎఫ్ఎమ్సీజీ, బ్యాంకింగ్ షేర్ల కొనుగోలుకు మదుపర్లు మొగ్గుచూపడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స
|
దేశీయ మార్కెట్లు 0.5 శాతానికి పైగా లాభాలతో దూసుకెళ్లాయి. వాహన, లోహ, ఎఫ్ఎమ్సీజీ, బ్యాంకింగ్ షేర్ల కొనుగోలుకు మదుపర్లు మొగ్గుచూపడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పుంజుకోగా.. ఎన్ఎస్ఈ 50 సెంటిమెంటు మార్కు 8100ను దాటేసింది. సెన్సెక్స్ 115 పాయింట్ల లాభంతో 26,346 పాయింట్ల వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 8,127వద్ద ముగిసింది. నిఫ్టీ టాప్ గెయినర్గా లుపిన్ నిలిచింది. ఈ కంపెనీ షేరు 3.14 శాతం ఎగిసి, రూ.1,536 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్లో బాగా లాభపడిన వాటిలో ఏసియన్ పెయింట్స్(3.58%), ఎమ్ అండ్ ఎమ్(3.29%), లుపిన్(3.22%), భారతీ ఎయిర్టెల్(2.73%), మారుతి(2.68%)ఉండగా; నష్టపోయిన కంపెనీల జాబితాలో టెక్ మహీంద్రా(2.32%), హెచ్డీఎఫ్సీ(1.72%), టీసీఎస్(1.61%), గెయిల్(1.26%), ఐడియా సెల్యులార్(1.09%), సన్ఫార్మా ఉన్నాయి. కొన్ని షేర్లలో నెలకొన్న కొనుగోలు మద్దతుతో మార్కెట్లు లాభాల్లో ముగిసినట్టు విశ్లేషకులు చెప్పారు. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం జంప్ అయ్యాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ స్వల్పంగా 0.07 పైసలు లాభపడి 68.26గా ఉంది.
Comments
English summary