For Quick Alerts
For Daily Alerts
నల్లధనాన్ని మారుస్తున్నారా? అయితే చర్యలు తప్పవు: ప్రభుత్వం హెచ్చరిక
నల్లధనాన్ని తెల్లగా మారుస్తున్న వారికి ఆర్థికమంత్రిత్వ శాఖ మరోసారి గట్టి హెచ్చరికలే పంపింది. పెద్దనోట్ల రద్దయిన తర్వాత భారీ ఎత్తున జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో మనీ లాండరింగ్కు పాల్పడితే కఠిన
|
నల్లధనాన్ని తెల్లగా మారుస్తున్న వారికి ఆర్థికమంత్రిత్వ శాఖ మరోసారి గట్టి హెచ్చరికలే పంపింది. పెద్దనోట్ల రద్దయిన తర్వాత భారీ ఎత్తున జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో మనీ లాండరింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పని గురువారం తెలియజేసింది. ఆ మేరకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ట్విట్టర్ ద్వారా కఠిన హెచ్చరిక సంకేతాలను జారీ చేశారు.
అక్రమంగా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్న వారిని ఉపేక్షించేదిలేదని వెల్లడించారు. ఈ మేరకు వివిధ చట్ట ఏజెన్సీల సమన్వయంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. అక్రమ లావాదేవీలపై నిఘా ఉంచామని ఇప్పటికే పలువురిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖ దాడుల్లో భారీ ఎత్తున డబ్బును స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించిన ఆయన ఆ దాడులు ఇంకా కొనసాగుతాయన్నారు.
కాగా నల్లధనంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కఠినమైన ఆదేశాలు జారీచేశారు. స్వచ్ఛందంగా ప్రకటిస్తే 50 శాతం పెనాల్టీ, ఆదాయ పన్ను అధికారుల దాడుల్లో దొరికితే , జరిమానా, పన్ను కలిసి 85 శాతం చెల్లించాల్సిన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నల్లధనం ఉన్నవారు స్వయంగా ప్రకటించకపోతే సర్చార్జ్, పెనాల్టీలతో పాటు పెద్ద ఎత్తున పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
Comments
English summary
నల్లధనాన్ని మారుస్తున్నారా? అయితే చర్యలు తప్పవు: ప్రభుత్వం హెచ్చరిక | People converting black money into white will not be spared says Economic Affairs Secretary
Story first published: Friday, December 2, 2016, 14:53 [IST]