For Quick Alerts
For Daily Alerts
97 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
అంతర్జాతీయంగా నెలకొన్న భయాందోళనతో గురువారం కూడా నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కొద్దిగా తేరుకున్నాయి. సెన్సెక్స్97 పాయింట్ల నష్టంతో 27,430వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు క్షీణించి 8,484వద్ద ముగిశాయ
|
అంతర్జాతీయంగా నెలకొన్న భయాందోళనతో గురువారం కూడా నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కొద్దిగా తేరుకున్నాయి. సెన్సెక్స్97 పాయింట్ల నష్టంతో 27,430వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు క్షీణించి 8,484వద్ద ముగిశాయి. నిన్నటి ముగింపులో 349 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ 48.92 నష్టపోయి 27,478.30గా, నిఫ్టీ 14.45 పాయింట్ల నష్టంతో 8499.55గా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మిడ్ సెషన్లో నష్టాల్లోంచి సెన్సెక్స్, నిఫ్టీలు కోలుకుని లాభాల్లో ట్రేడయ్యాయి.
ఎఫ్ఎంసీజీ తప్ప అన్ని రంగాల షేర్లు నష్టాల్లో కొనసాగాయి. అందులో చమురు,సహజ వాయు రంగ షేర్లు అత్యధికంగా 1.83%; ప్రభుత్వ రంగ షేర్లు 1.75% నష్టపోయాయి. మౌలికరంగం(1.64%), స్థిరాస్తి రంగ(1.29%) షేర్లు సైతం నష్టాల్లోనే ముగిశాయి. ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు మాత్రం 0.13% పైకి ఎగిశాయి.
సెన్సెక్స్ టాప్ గెయినర్లలో హీరో మోటార్ కార్ప్(1.66%), ఐటీసీ(1.29%), డా. రెడ్డీస్(0.71%), టీసీఎస్(0.67%), హెచ్డీఎఫ్సీ(0.56%) ఉండగా, బాగా నష్టపోయిన వాటిలో అదానీ పోర్ట్స్(3.29%), ఓఎన్జీసీ(3.53%), టాటా స్టీల్(2.5%), ఏసియన్ పెయింట్స్(2.36%), ఎస్బీఐ(2.25%) ఉన్నాయి.
Comments
English summary