255 పాయింట్ల నష్టంతో...
స్టాక్ మార్కెట్లు నేడు దాదాపు ఒక శాతం నష్టపోయాయి. నిన్న టాటా గ్రూప్లో కలకలం కారణంగా సూచీలు నష్టపోగా.. నేడు కూడా నష్టాల బాటలోనే కొనసాగాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మార్కెట్ ముగిసే సరికి
స్టాక్ మార్కెట్లు నేడు దాదాపు ఒక శాతం నష్టపోయాయి. నిన్న టాటా గ్రూప్లో కలకలం కారణంగా సూచీలు నష్టపోగా.. నేడు కూడా నష్టాల బాటలోనే కొనసాగాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మార్కెట్ ముగిసే సరికి భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 255 పాయింట్లు నష్టపోయి 27,837 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 76పాయింట్లు నష్టపోయి 8,615 పాయింట్లకు చేరింది. మరో వైపు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.81 వద్ద కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈలో ఐడియా సెల్యూలర్, కొటక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్(డీ), టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. యాక్సిస్ బ్యాంకు షేర్లు 8 శాతానికి పైగా నష్టపోయాయి. మిస్త్రీకి ఉద్వాసన పలకడంతో టాటా గ్రూప్లో కొనసాగుతున్న వివాదాల కారణంగా ఆ కంపెనీల షేర్లు ఈ రోజు నష్టాల్లోనే కొనసాగాయి. టాటా మోటార్స్ 4.27%; టాటా స్టీల్ 4.01% నష్టపోయాయి.