2050 నాటికి 70 లక్షల ఉద్యోగాలు గల్లంతు
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2050 నాటికి దేశంలో 70 లక్షల ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి తలెత్తుతుంది. భారత్లో రైతులు, చిరువ్యాపారులు, కాంట్రాక్టు కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు..
దేశంలో గత నాలుగేళ్లుగా రోజుకు 550 మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని దిల్లీకి చెందిన ఒక సంస్థ అధ్యయనం వెల్లడించింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2050 నాటికి 70 లక్షల ఉద్యోగాలు మాయం అవుతాయని తెలుస్తోంది. భారత్లో రైతులు, చిరు వ్యాపారులు, కాంట్రాక్టు కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు... ఇప్పటికే జీవనోపాధి కోసం పలు సవాళ్లు ఎదుర్కొంటున్నారని ప్రహార్ రూపొందించిన నివేదిక వెల్లడించింది. దిల్లీకి చెందిన పౌర సేవా సంస్థ ప్రహార్.
ఇది కూడా చదవండి అధిక వేతనాలు పొందుతున్న ప్రొఫెషనల్స్
కార్మిక బ్యూరో 2016లో వెల్లడించిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా కొత్త ఉద్యోగాల సృష్టి ఈ విధంగా ఉంది. 2015లో దేశం 1.35 లక్షల ఉద్యోగాలను మాత్రమే సృష్టించింది. 2011లో ఇది 9 లక్షలుగా ఉండగా, 2013లో 4.19 లక్షలుగా ఉంది. ఈ సమాచార విశ్లేషణ భయపెట్టే అంశాలను వెల్లడిస్తోంది. ఉద్యోగాలు పెరగాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలే ఊడిపోయే పరిస్థితి ఉంది. 2050 నాటికి 70 ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉండగా జనాభా మరో 60 కోట్లకు పైగా పెరగనుంది.