నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలున్నప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రా, చమురు,సహజ వాయు, లోహ రంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 70.58 పాయింట్లు నష్టపోయి 28,224 వద్ద; ఎన్ఎస్ఈ నిఫ్టీ 16.65 పాయింట్ల నష్టంతో 8706 వద్ద ముగిశాయి. బీఎస్ఈలో రంగాల వారీ చూస్తే ఐటీ రంగ సూచీ 0.7 శాతం, హెల్త్కేర్ 0.59 శాతం, టెక్నాలజీ 0.36శాతం, కన్సూమర్ డ్యూరబుల్స్ 0.27 శాతం పైకి ఎగిశాయి. మరో వైపు క్యాపిటల్ గూడ్స్ 1.12 శాతం, చమురు,సహజవాయువు రంగం 0.72 శాతం, లోహ రంగం 0.68 శాతం, మౌలిక రంగం 0.64 శాతం నష్టాలకు గురయ్యాయి.
సెన్సెక్స్ లాభపడిన కంపెనీల్లో టీసీఎస్(1.42%), లుపిన్(1.34%), విప్రో(0.99%), ఏసియన్ పెయింట్స్(0.9%), సన్ఫార్మా(0.7%) ఉండగా; నష్టపోయిన వాటిలో భారతి ఎయిర్టెల్(-2.14%), అదానీ పోర్ట్స్(-2.05%), ఎల్ అండ్ టీ(-1.61%), గెయిల్(-1.07%), ఓఎన్జీసీ(-1.00%) ఉన్నాయి.