కల్యాణ్ జువెలర్స్ కొత్త పథకాలు
ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ-కామర్స్ను సమర్థంగా ఉపయోగించుకోవడంతో పాటు కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని కల్యాణ్ జువెలర్స్ ప్రణాళికలు రచిస్తోంది. కల్యాణ్ ప్రయారిటీ పేరుతో మెంబర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఆ సంస్థ ధనవర్ష పేరుతో 11 నెలల గోల్డ్ సేవింగ్ స్కీమ్ను ప్రవేశపెట్టబోతోంది. దీని ద్వారా సున్నా శాతం బంగారం వృథాతో ఇతర సంప్రదాయ బంగారు వ్యాపారులతో పోటీకి కల్యాణ్ జువెలర్స్ సిద్దమవుతోంది.
ఈ-కామర్స్పై గురి
దీపావళి సమయంలో తనదైన సొంత పోర్టల్ను తెరిచేందుకు సైతం ప్రయత్నాలు మొదలయ్యాయి. దీని ద్వారా ఉత్పత్తులను ఆన్లైన్లోకి తెచ్చేందుకు కల్యాణ్ జువెలర్స్ సిద్దమవుతోంది. దాని తర్వాత ఆరు నెలలకు అన్ని దుకాణాలను ఒకే ప్లాట్ఫాం మీదకు తీసుకురానున్నారు. దీంతో వినియోగదారుడు ఒక స్టోర్లో కూర్చొని ఇతర స్టోర్లలో ఉన్న ఏ కలెక్షన్నైనా వీక్షించేందుకు అవకాశం కలుగుతుంది. దీంతో విస్తృతమైన కల్యాణ్ ఉత్పత్తుల్లోంచి తనకు నచ్చినదాన్ని ఆర్డర్ చేసేందుకు వినియోగదారుకు అవకాశం కలుగుతుంది.