రూ. 27 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం
రోడ్డు,
రైల్వే
ప్రాజెక్టులకు
సంబంధించి
కేంద్రం
కీలక
నిర్ణయాలు
తీసుకుంది.
ఆంధ్ర
ప్రదేశ్,
తెలంగాణతో
పాటు
తొమ్మిది
రాష్ట్రాల్లో
రూ.24,000
కోట్ల
విలువైన
తొమ్మిది
రైల్వే
ప్రాజెక్టులకు
ఆమోద
ముద్ర
వేసింది.
ఆంధ్రప్రదేశ్లో
విజయవాడ-గూడూరు
మధ్య
రూ.
3875
కోట్ల
వ్యయంతో
మూడో
రైల్వే
లైను
నిర్మించాలని
ప్రధాని
నరేంద్రమోదీ
నేతృత్వంలోని
కేంద్ర
క్యాబినెట్
సబ్
కమిటీ
నిర్ణయం
తీసుకుంది.
ఇవన్నీ
వచ్చే
4-5ఏళ్లలో
పూర్తయ్యే
అవకాశం
ఉంది.
మొత్తం
తొమ్మిది
రైలు
మార్గాల
వలన
ఆయా
మార్గాల్లో
ఏటా
150
కోట్ల
టన్నుల
సరుకుల
రవాణా
సామర్ధ్యం
కొత్తగా
జత
చేరుతుందని
అంచనా
వేస్తున్నారు.
నూతన
రైలు
మార్గాలు
వస్తే
ప్రస్తుత
లైన్లపై
ఒత్తిడి
తగ్గుతుందని
భావిస్తున్నారు.
కేంద్ర
కేబినెట్
ఆమోదించిన
రోడ్డు
ప్రాజెక్టులు
దేశంలోని
5
రాష్ట్రాల్లో
రూ.6,461
కోట్ల
అంచనాతో
1,120
కిలోమీటర్ల
జాతీయ
రహదార్ల
నిర్మాణానికి
ఆమోదం
తెలిపింది.
ఈ
ప్రాజెక్టులన్నీ
కర్ణాటక,
బిహార్,
ఒడిశా,
రాజస్థాన్,
పశ్చిమ
బెంగాల్
రాష్ట్రాలకు
చెందినవి.
కొచ్చిన్
పోర్టు
ట్రస్టుకు
ఇచ్చేన
రుణంపై
విధించిన
రూ.897
కోట్ల
అపరాధ
వడ్డీని
కేంద్రం
మాఫీ
చేసింది.
భారత-సైప్రస్
మధ్య
కొత్తగా
కుదిరిన
ద్వంద్వ
పన్నుల
నిరోధక
ఒప్పందా(డిటిఎఎ)నికి
పచ్చజెండా
ఊపారు.
ఫిజితో
విమానయాన
సేవల
ఒప్పందాలకు
ఆమోదం
తెలిపారు.