ఫోర్బ్స్ ఆసియా: ఇన్ఫోసిస్ మూర్తితో సహా ఆరుగురు
ఫోర్బ్స్ ఆసియా ప్రకటించిన దాతల జాబితాలో ఏడుగురు భారతీయలు స్థానం దక్కించుకున్నారు. వీరిలో కేరళకు చెందిన వ్యాపారవేత్త సన్నీ వార్కీ ఉన్నారు. ఆయన తన 2.25 బిలియన్ డాలర్ల సంపదలో సగభాగాన్ని విరాళంగా ఇచ్చారు.
సన్నీ వార్కీ 14 దేశాల్లో 70 ప్రైవేట్ పాఠశాలలను నడిపిస్తున్నారు. అలాగే ఈ జాబితాలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు గోపాలకృష్ణన్, నందన్ నిలేకని, శిబులాల్, మోహన్ దాస్ ఉన్నారు. వీరంతా ఆరోగ్య, విద్యా రంగాల్లో పేద విద్యార్ధుల చదువుకు సాయం అందిస్తున్నారు.
ఫోర్బ్స్ ఆసియా దాతల జాబితాలో ఏడుగురు భారతీయులు
ఫోర్బ్స్ ఆసియా దాతల జాబితాలో ఏడుగురు భారతీయులు
వీరితో పాటు ఇన్ఫోసిస్ మరో సహ వ్వవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా ఈ జాబితాలో ఉన్నారు. ప్రాచీన భారతీయ సాహిత్య కావ్యాలకు ప్రాచుర్యం కల్పించాలనే లక్ష్యంతో నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి 5.2 మిలియన్ డాలర్లను హార్వర్డ్ యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చారు.
ఫోర్బ్స్ ఆసియా దాతల జాబితాలో ఏడుగురు భారతీయులు
రోహన్ మూర్తి ద్వారా నారాయణ మూర్తి ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ జాబితాలో విట్ కంట్ అండ్ షాప్ట్స్ బరీ టైలర్స్ వ్వవస్థాపకులు సురేశ్, మహేశ్ రామకృష్ణన్లకు చోటు లభించింది.
ఫోర్బ్స్ ఆసియా దాతల జాబితాలో ఏడుగురు భారతీయులు
వీరు తమ సంపాదనలో 3 మిలియన్ డాలర్లు వెచ్చించి భారత్లో
4 వేల మందికి పైగా టైలరింగ్ శిక్షణ ఇప్పించారు. ఇక ఫోర్బ్స్ ఆసియా దాతల జాబితాలో తొలిసారిగా నేపాల్కు చెందిన బినోద్ కే చౌదరీ స్ధానం దక్కించుకున్నారు.