హ్యందాయ్కు రూ. 420 కోట్ల జరిమానా విధించిన సీసీఐ
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్కు కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ. 420 కోట్ల జరిమానా విధించింది. ఈ డబ్బును 60 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. హ్యుందాయ్కు ఈ జరిమానా విధించడానికి గల కారణం బహిరంగ మార్కెట్లో స్పేర్ పార్ట్స్ లభించేలా చూడకపోవడమే.
మూడు సంవత్సరాల టర్నోవర్పై సరాసరి చూసి రెండు శాతం మొత్తాన్ని జరిమానాగా విధిస్తున్నట్లు సీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇలా ఉంటే గతేడాది ఆగస్టులో 14 కార్ల తయారీ కంపెనీలపై మొత్తం రూ. 2,554 కోట్ల జరిమానాను సీసీఐ విధించగా, వీటిల్లో చాలా కంపెనీలు కోర్టులను ఆశ్రయించి జరిమానా ఆదేశాలపై స్టే తెచ్చుకున్నాయి.
విచారణలో భాగంగా గతంలో జారీ చేసిన స్టేలను ఎత్తివేసిన కోర్టు సీసీఐ చేస్తున్న దర్యాప్తునకు సహకరించాలని సూచించాయి. గతంలో టాటా మోటార్స్ పై రూ. 1,346 కోట్లు, మారుతి సుజుకిపై రూ. 471 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
కారు విడిభాగాలను మార్కెట్లో లభించకుండా చేసి, 28 నుంచి 644 శాతం అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు సీసీఐ విచారణలో వెల్లడైంది.