బెంగళూరు టు బ్యాంకాక్: విమాన ప్రయాణం రూ.3,999
బెంగళూరు: పర్యాటకులు విదేశాలు చుట్టిరావడానికి విమానయాన సంస్థలు పలు ఆకర్షనీయమైన ఆఫర్లు అందిస్తున్నాయి. పర్యాటకులలో బ్యాంకాక్ లో ఒక్కసారైనా పర్యాటించాలని కలలుకనేవారు చాలమంది ఉంటారు.
అలాంటి వారికి ఎయిర్ ఏషియా సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. బెంగళూరు నుండి బ్యాంకాక్ ప్రయాణ ధర రూ. 3,999 అని ప్రకటించింది. తక్కువ ధరతో విమానంలో ప్రయాణించడానికి ఎయిర్ ఏషియా సంస్థ పలు ఆకర్షనీయమైన ఆఫర్లు ఇస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు బెంగళూరు-బ్యాంకాక్ ల మధ్య విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నామని ఎయిర్ ఏషియా సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేది నుండి సర్వీసులు ప్రారంభిస్తున్నారు. అయితే టిక్కెట్లు బుకింగ్ కు ఇప్పటి నుండి అవకాశం కల్పిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
2016 ఆగస్టు 31వ తేదీ వరకు బ్యాంకాక్ వెళ్లడానికి ఈ నెల 5వ తేది నుండి టిక్కెట్లు బుక్ చేసుకొవడానికి అవకాశం ఉంది. అతి తక్కువ ధరలకు పలు నగరాల మధ్య విమాన సర్వీసు సేవలు అందిస్తున్న సంస్థగా ఎయిర్ ఏషియా గుర్తింపు తెచ్చుకుంటున్నది. ఇప్పటికే బెంగళూరు-గోవాల మద్య విమాన ప్రయాణ ధర రూ. 990 నిర్ణయించింది.