For Quick Alerts
For Daily Alerts
ప్రధాని చేతుల మీదగా 8న ముద్రా బ్యాంక్ ప్రారంభం
|
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి బడ్జెట్లో ప్రతిపాదించిన ముద్రా బ్యాంకును వచ్చే నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రూ. 20,000 కోట్లతో ఏర్పాటవుతోన్న ఈ బ్యాంకు సూక్ష్మ రుణ సంస్ధలకు తిరిగి రుణాలివ్వడమే కాకుండా, ఈ రంగానికి నియంత్రణ సంస్ధగా వ్వవహరించనుంది.
అలాగే ఈ బ్యాంకు వల్ల దాదాపు 5.77 కోట్ల చిన్న వ్యాపార సంస్ధలకు లబ్ధి చేకూరుతుంది. ముద్రా బ్యాంకు విధి విధానాలను ఖారారు చేసేందుకు సంబంధిత వర్గాలతో ఆర్ధిక శాఖ బుధవారం సంప్రదింపులు నిర్వహించింది.
ఆర్ధిక సేవల కార్యదర్శి హస్ముఖ్ అదియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సూక్ష్మ రుణ సంస్ధలు, ఎస్బీఎఫ్సీ బ్యాంకులు, నాబార్డ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రతినిధులు హజరయ్యారని ఆర్ధిక శాఖలో ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
English summary
ప్రధాని చేతుల మీదగా 8న ముద్రా బ్యాంక్ ప్రారంభం | PM Narendra Modi to launch Rs 20,000 crore MUDRA Bank on April 8
Story first published: Thursday, March 26, 2015, 8:39 [IST]