ఆర్ధిక సర్వే 2014-15: ముఖ్యాంశాలు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి అరణ్ జైట్లీ 2014-15 సంవత్సరానికి గాను ఆర్ధిక సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టారు. భారత్లో మేక్ ఇన్ ఇండియాతో పాటు దేశ స్ధూల జాతీయోత్పత్తి(జీడీపీ)పై దృష్టి పెట్టినట్లు ఈ సర్వేలో పేర్కొన్నారు.
ఆర్ధిక సర్వే 2014-15లోని ముఖ్యాంశాలు:
* 2015-16 సంవత్సరానికి గాను ఆర్ధిక వృద్ధిరేటు 8.1 శాతం నుంచి 8.5 శాతం మధ్య ఉంటుంది.
* బ్యాంకింగ్, బీమా మరియు ఆర్ధిక రంగంలో ప్రభుత్వం భారీ సంస్కరణలు ప్రవేశపెట్టనుంది.
* 2014-15 సంవత్సరానికి గాను ఆహారధాన్యాల ఉత్పత్తి 257.07 మిలియన్ టన్నులు.
* రైల్వేల నిర్మాణ సంస్కరణలు, సమగ్ర ఆర్థిక విధానాల టెక్నాలజీకి సిఫార్సులు.
* దేశ ఆదాయం పెంచేందుకు ప్రాధాన్యం
* ప్రభుత్వ పథాకలు అర్హులకే చేరాలంటే 'జామ్' కీలకం
* JAM అంటే జన్ ధన్ యోజన, ఆధార్ మొబైల్ నెంబర్
* ఈ ఆర్ధిక సంవత్సరంలో సాప్ట్ వేర్ ఉత్పత్తులు 12 శాతం నుంచి 14 శాతానికి పెరిగే అవకాశం.
* దేశంలో పర్యాటక రంగం మంచి పురోగతిలో ఉంది. 2014లో విదేశీ పర్యాటకుల సంఖ్య 7.1 శాతానికి పెరిగింది.
* సాంప్రదాయ మార్కెట్ నుంచి ఆధునిక రిటైల్ మార్కెట్కు వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది.
* ఆన్లైన్ మార్కెట్ పోత్సాహాంతో పాటు వినియోగదారుల హక్కుల రక్షణకు చర్యలు తీసుకుంటాం.
* మహిళా అక్షరాస్యతతో పాటు విద్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు చర్యలు.
* లక్ష మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సౌరశక్తి ప్రాజెక్టులు
* వ్యవసాయ మార్కెటింగ్లో ఈ ఫ్లాట్ఫామ్ని అమలు చేసేందుకు రూ. 200 కోట్ల నిధులు మంజూరు.
* 14వ ఆర్ధిక సంఘం నివేదిక అమలుతో రాష్ట్రాలకు మరిన్ని నిధులు.
* పెట్టుబడి వాతావరణంలో మెరుగు ప్రభుత్వ పెట్టుబడులు పెట్టేలా ఆలోచన.
* భారతదేశం పచ్చదనం వైపు నడిచేలా చేసేందుకు గాను కార్బన్ రాయితీ నుంచి కార్బన్ పన్ను.