మారుతి సుజుకీ క్యూ3 ఫలితాలు: లాభం రూ.802 కోట్లు
న్యూఢిల్లీ: మారుతీ సుజకీ మూడో త్రైమాసిక ఫలితాలు మదుపర్లలో ఉత్సహం కలిగించాయి. నికరలాభం మెరుగ్గా ఉన్నా, విశ్లేషకుల అంచనాలకు కాస్త దూరంలో నలించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మూడో త్రైమాసికంలో రూ. 802.2 కోట్లు నికరలాభాన్ని ఆర్జించింది.
2013-14 ఇద సమయంలో ఆర్జించిన నికరలాభం రూ. 681.15 కోట్లతో పోలిస్తే ఈసారి 17.8 శాతం అధికం. ఇక నికర విక్రయాలు రూ. 10,619.68 కోట్ల నుంచి 15.5 శాతం పెరిగి రూ. 12,263.14 కోట్లకు చేరాయి. ఈ త్రైమాసికంలో విక్రయించిన వాహనాల సంఖ్య 2,88,151 నుంచి 12.4 శాతం పెరిగి 3,23,911కు చేరాయి.
ఇందులో దేశీయ అమ్మకాలు 2,68,185 నుంచి 2,95,202కు ఎగుమతులు 19,966, నుంచి 28, 709కు పెరిగాయి. ఇక సమీక్ష త్రైమాసికంలో ఎగుమతులపై రూ. 1,224 కోట్ల ఆదాయం లబించింది.
వాహనాలు అధికంగా విక్రయించడం, ముడి పదార్ధాలు ఖర్చు తగ్గించుకునేందుకు తీసుకున్న చర్యలతో పాటు విదేశీ మారక ద్రవ్య విలువ కలిసి రావడం వల్ల నికర లాభం పెరిగిందని సంస్ధ పేర్కొంది. మారుతీ సుజుకీ ఇండియా నికరలాభం రూ. 875 కోట్లకు చేరుతుందని విశ్లేషకలు అంచనా వేశారు. ఐతే ఇది రూ. 73 కోట్ల మేర తగ్గింది.