For Quick Alerts
For Daily Alerts
కనుమరుగైన రూపాయి నోటు మళ్లీ రాబోతోంది
|
న్యూఢిల్లీ: దేశంలో రూపాయి నాణేలు వాడుకలోకి రాడవంతో రూపాయి నోటు కనుమరుగైంది. కాగా రూపాయి నోటు సరికొత్తగా మరోసారి రాబోతోంది. 20 ఏళ్ల తర్వాత రూపాయి నోటును ముద్రించనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రిత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ మేరకు కేంద్ర ఆర్ధికశాఖ అధికారి మాట్లాడుతూ.. ఈ రూపాయి నోటుపై వాడే ఇండిగో రంగు బదులుగా గులాబీ, ఆకుపచ్చ రంగుల సమ్మేళనంతో నోటును ముద్రించనున్నట్టు తెలిపారు. ఈ నోటుపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేయనున్నారన్నారు.
కాగా మిగిలిన నోట్లపై యధాతథంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం చేస్తారు. రూపాయి నోటుపై 'భారత్ సర్కార్', 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా' పేర్లను ముద్రిస్తారు. అలాగే దేశంలోని 15 భాషల్లో రూపాయి విలువను నోటుపై ముద్రించనున్నారు.
Comments
English summary
కనుమరుగైన రూపాయి నోటు మళ్లీ రాబోతోంది | Rupee 1 Notes to Make a Comeback
Story first published: Sunday, December 28, 2014, 13:26 [IST]