పాపతో కేటీఆర్.. మంచు లక్ష్మి ముచ్చట్లు (ఫోటోలు)
హైదరాబాద్: హైదరాబాద్ను ప్రపంచ హెల్త్కేర్ రంగానికి హబ్గా మారడానికి అన్ని అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో ఒయాసిస్ సంతాన సాఫల్యకేంద్రం 5వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ సంతాన సాఫల్యతకు ఆధునిక చికిత్సా పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చిన ఒయాసిస్ ఐదేళ్లు పూర్తిచేసుకోవడంపై అభినందనలు తెలిపారు. అదే విధంగా సామాజిక బాధ్యత కింద ఏడాదికి 12 మంది పేదలకు ఉచితంగా చికిత్సను అందజేసేందుకు అమూల్య పేరుతో ఫౌండేషన్ను ఏర్పాటు చేశారని ఇది మంచి శుభపరిణామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అమూల్య ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీనటి మంచు లక్ష్మితో పాటు ఒయాసిస్ ఆస్పత్రి ఎండీ కిరణ్గేడెల, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
పాపతో కేటీఆర్.. మంచు లక్ష్మి ముచ్చట్లు
శనివారం బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో ఒయాసిస్ సంతాన సాఫల్యకేంద్రం 5వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పక్కన సినీ నటి మంచు లక్ష్మీ.
పాపతో కేటీఆర్.. మంచు లక్ష్మి ముచ్చట్లు
ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ సంతాన సాఫల్యతకు ఆధునిక చికిత్సా పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చిన ఒయాసిస్ ఐదేళ్లు పూర్తిచేసుకోవడంపై అభినందనలు తెలిపారు.
పాపతో కేటీఆర్.. మంచు లక్ష్మి ముచ్చట్లు
అదే విధంగా సామాజిక బాధ్యత కింద ఏడాదికి 12 మంది పేదలకు ఉచితంగా చికిత్సను అందజేసేందుకు అమూల్య పేరుతో ఫౌండేషన్ను ఏర్పాటు చేశారని ఇది మంచి శుభపరిణామని పేర్కొన్నారు.
పాపతో కేటీఆర్.. మంచు లక్ష్మి ముచ్చట్లు
ఈ సందర్భంగా అమూల్య ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీనటి మంచు లక్ష్మితో పాటు ఒయాసిస్ ఆస్పత్రి ఎండీ కిరణ్గేడెల, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.