కొటాక్ బ్యాంక్ చేతికి ఐఎన్జీ వైశ్యా..? (ఫోటోలు)
న్యూఢిల్లీ: కొటాక్ మహేంద్ర బ్యాంక్లో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ విలీనం కానుందని సమాచారం. ఇందుకు సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నాయని.. ఈ నెలాఖరులోగా ఒప్పంద విషయాన్ని ఇరు బ్యాంకులు ప్రకటించవచ్చని ఈటీనౌ టెలివిజన్ ఛానల్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.
ఆ వార్తా కథనం ప్రకారం ఈ ఒప్పంద విలువ రూ. 16,500 కోట్లుగా ఉండనుందని విశ్వసనీయ సమాచారం. 2:2:5 నిష్పత్తిలో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ను కొటాక్ మహేంద్ర బ్యాంక్ విలీన చేసుకోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై కొటాక్ మహేంద్ర బ్యాంక్ ప్రతినిధిని కోజెన్సిస్ సంప్రదించగా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. గతంలో కూడా ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ను టేకోవర్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అవన్నీ రూమర్సేనంటూ ఆ తర్వాత ఎల్ అండ్ టీ పైనాన్స్ హోల్డింగ్స్ కొట్టి పారేసింది.
ఇక కొటాక్ మహేంద్ర బ్యాంక్ విషయానికి వస్తే ఫిబ్రవరి 2003లో కొటాక్ మహేంద్ర ఫైనాన్స్ ఆర్బీఐ నుంచి బ్యాంకింగ్ లైసెన్సును పొందడంతో కొటాక్ మహేంద్ర బ్యాంకుగా అవతరించింది. భారత్లో బ్యాంకింగేతర ఆర్ధిక సంస్ధ (ఎన్బీఎఫ్సీ) బ్యాంకుగా మారడం అదే తొలిసారి కావడం విశేషం.
కొటాక్ చేతికి ఐఎన్జీ వైశ్యా..?
కొటాక్ మహేంద్ర బ్యాంక్లో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ విలీనం కానుందని సమాచారం. ఆ వార్తా కథనం ప్రకారం ఈ ఒప్పంద విలువ రూ. 16,500 కోట్లుగా ఉండనుందని విశ్వసనీయ సమాచారం. 2:2:5 నిష్పత్తిలో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ను కొటాక్ మహేంద్ర బ్యాంక్ విలీన చేసుకోవచ్చని తెలుస్తోంది.
కొటాక్ చేతికి ఐఎన్జీ వైశ్యా..?
వైశ్యా బ్యాంకులో ఐఎన్జీ గ్రూప్ వాటా కోనుగోలు చేయడంతో 2002లో ఐఎన్జీ వైశ్యా బ్యాంకు ఏర్పడింది. ప్రధాన కేంద్రం బెంగుళూరు. ఒక దేశీయ బ్యాంకు, విదేశీ బ్యాంకు విలీనమై
కార్యకలాపాలను అందించడం అప్పటికి ఇదే ప్రధమం. 2013 నాటికి ఐఎన్జీ వైశ్యా బ్యాంకు దేశంలో అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుగా అవతరించింది. 20 లక్షల మందికి పైగా ఖాతాదారులకు సేవలందిస్తోంది. మొత్తం ఆస్తుల విలువ రూ. 54, 836 కోట్లు.
కొటాక్ చేతికి ఐఎన్జీ వైశ్యా..?
బ్యాంకు ప్రధాన వ్యవస్ధాపకుడు, ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉదయ్ కొటక్. 1985లో అంటే 27 ఏల్ల వయసులోనే ఒక బ్యాంకు పెట్టాలన్న ఆలోచనతో కొటాక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ను స్ధాపించారు.
కొటాక్ చేతికి ఐఎన్జీ వైశ్యా..?
ఇక కొటాక్ మహేంద్ర బ్యాంక్ విషయానికి వస్తే ఫిబ్రవరి 2003లో కొటాక్ మహేంద్ర ఫైనాన్స్ ఆర్బీఐ నుంచి బ్యాంకింగ్ లైసెన్సును పొందడంతో కొటాక్ మహేంద్ర బ్యాంకుగా అవతరించింది. భారత్లో బ్యాంకింగేతర ఆర్ధిక సంస్ధ (ఎన్బీఎఫ్సీ) బ్యాంకుగా మారడం అదే తొలిసారి కావడం విశేషం.
బ్యాంకు ప్రధాన వ్యవస్ధాపకుడు, ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉదయ్ కొటక్. 1985లో అంటే 27 ఏల్ల వయసులోనే ఒక బ్యాంకు పెట్టాలన్న ఆలోచనతో కొటాక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ను స్ధాపించారు. ఇక వైశ్యా బ్యాంకులో ఐఎన్జీ గ్రూప్ వాటా కోనుగోలు చేయడంతో 2002లో ఐఎన్జీ వైశ్యా బ్యాంకు ఏర్పడింది.
ప్రధాన
కేంద్రం
బెంగుళూరు.
ఒక
దేశీయ
బ్యాంకు,
విదేశీ
బ్యాంకు
విలీనమై
కార్యకలాపాలను
అందించడం
అప్పటికి
ఇదే
ప్రధమం.
2013
నాటికి
ఐఎన్జీ
వైశ్యా
బ్యాంకు
దేశంలో
అతి
పెద్ద
ప్రైవేటు
బ్యాంకుగా
అవతరించింది.
20
లక్షల
మందికి
పైగా
ఖాతాదారులకు
సేవలందిస్తోంది.
మొత్తం
ఆస్తుల
విలువ
రూ.
54,
836
కోట్లు.