250 విమానాలు, రూ.1.55 లక్షల కోట్లు: ఇండిగో
న్యూఢిల్లీ: ఐరోపాకు చెందిన విమాన తయారీ సంస్ద ఎయిర్ బస్ నుంచి అత్యాధునిక ఏ320 నియో విమానాలు 250 కొనుగోలు చేయాలని ఇండిగో నిర్ణయించింది. ఈ ఒప్పందం విలువ 2550 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో రూ.1.55 లక్షల కోట్లు.
యారిస్లో ఉన్న ఎయిర్బస్ ప్రధాన కార్యాలయంలో ఇండిగో సహ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్లు రాకేశ్ గంగ్ వాల్, ఇండిగో మాతృసంస్ద ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇప్పటి వరకు ఎయిర్బస్కు వచ్చిన ఆర్డర్లలో ఇదే అతి పెద్దది. ఈ ఒప్పందం విలువ ఇరు కంపెనీలు వెల్లడించకపోయినప్పటికీ కంపెనీ వెబ్సైట్లో ఉన్న ఏ-320 ధర ఆధారంగా అగ్రిమెంట్ 2550 కోట్ల డాలర్ల స్థాయిలో ఉంటుందని ప్రాథమిక అంచనా.
ఈ విమానాలు సరఫగా 2018 నుంచి ప్రారంభం అవుతుంది. కొత్త మార్గాలలో నడిపేందుకు, సగటున 6ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన విమానాల స్దానంలో కొత్తవి ప్రవేశపట్టేందుకు వీటిని ఇండిగో వినియోగించనుంది.
భారత్లో ఎక్కవకాలం వ్యాపారం నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ భారీ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్యా ఘోష్ తెలిపారు. సింగపూర్ తర్వాత ఇండియా నుంచి అధిక స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయని ఎయిర్బస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ రావు ఈ సందర్భంగా చెప్పారు.
2005లో 100ఏ 320 విమానాలు, 2011లో 180 ఏ 320 నియో విమానాలకు ఇండిగో ఆర్డరు ఇచ్చింది. వీటి విలువ 11 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 67,100 కోట్లు). ప్రస్తుతం ఇండిగో సంస్ద వద్ద 180 సీట్ల ఏ320 విమానాలు 83 ఉన్నాయి.