వాక్ ఫర్ హెల్దీ హార్ట్: కిషన్తో యువత(పిక్చర్స్)
హైదరాబాద్: వరల్డ్ హార్ట్ డే(సెప్టెంబర్ 29)ను పురస్కరించుకుని అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నగరంలో 'వాక్ ఫర్ హెల్దీ హార్ట్' పేరిట నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. గుండె జబ్బుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రారంభించారు. అపోలో హాస్పిటల్స్ (సెంట్రల్ రీజియన్) సిఈఓ డాక్టర్ హరిప్రసాద్, కేథ్ల్యాబ్ డైరెక్టర్ డా. పిఎల్ఎన్ కప్పర్తి, కార్డియోథోరాసిక్ సర్జన్ డా. వెంకటరెడ్డిలు పాల్గొన్నారు.
హైదర్గూడలోని ఆస్పత్రి నుంచి బషీర్బాగ్ ఫ్లైఓవర్ చౌరస్తా వరకు సాగిన ర్యాలీలో యువతీయువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక మార్పులు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని అన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు తమ బాధ్యతల్ని మరువకుండా ఆరోగ్యం పట్ల ప్రజల్లో సమగ్రమైన అవగాహన కల్పించేందుకు ప్రత్యక కార్యక్రమాలను చేపట్టాలని కిషన్ రెడ్డి సూచించారు.
సాధ్యమైనంత వరకు రోగులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆస్పత్రి సిఈఓ సుబ్రహ్మణ్యం, హృద్రోగ విభాగాధిపతి డాక్టర్ వి సూర్యప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
వాక్ ఫర్ హెల్దీ హార్ట్
వరల్డ్ హార్ట్ డే(సెప్టెంబర్ 29)ను పురస్కరించుకుని అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నగరంలో 'వాక్ ఫర్ హెల్దీ హార్ట్' పేరిట నడక కార్యక్రమాన్ని నిర్వహించారు.
వాక్ ఫర్ హెల్దీ హార్ట్
గుండె జబ్బుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రారంభించారు.
వాక్ ఫర్ హెల్దీ హార్ట్
అపోలో హాస్పిటల్స్ (సెంట్రల్ రీజియన్) సిఈఓ డాక్టర్ హరిప్రసాద్, కేథ్ల్యాబ్ డైరెక్టర్ డా. పిఎల్ఎన్ కప్పర్తి, కార్డియోథోరాసిక్ సర్జన్ డా. వెంకటరెడ్డిలు పాల్గొన్నారు.
వాక్ ఫర్ హెల్దీ హార్ట్
అంతకుముందు జరిగిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక మార్పులు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని అన్నారు.
వాక్ ఫర్ హెల్దీ హార్ట్
హైదర్గూడలోని ఆస్పత్రి నుంచి బషీర్బాగ్ ఫ్లైఓవర్ చౌరస్తా వరకు సాగిన ర్యాలీలో యువతీయువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
వాక్ ఫర్ హెల్దీ హార్ట్
కార్పొరేట్ ఆస్పత్రులు తమ బాధ్యతల్ని మరువకుండా ఆరోగ్యం పట్ల ప్రజల్లో సమగ్రమైన అవగాహన కల్పించేందుకు ప్రత్యక కార్యక్రమాలను చేపట్టాలని కిషన్ రెడ్డి సూచించారు.
వాక్ ఫర్ హెల్దీ హార్ట్
సాధ్యమైనంత వరకు రోగులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు.