For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్ ఏషియా కన్నా మెరుగైన ఆఫర్‌ జెట్

By Nageswara Rao
|

హైదరాబాద్: భారత్‌లో విమానయాన విప్లవం మొదలైందా అంటే అవుననే అంటున్నారు ప్రయాణీకులు. ఇటీవల కాలంలో విమానయాన సంస్దలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రయాణీకులకు ప్రకటిస్తున్నాయి. తాజాగా జెట్ ఎయిర్‌వేస్ సంస్ద ఆఫర్ ప్రకటించింది.

దేశంలోని బిజీగా ఉన్న రూట్లలో ఎకానమీ క్లాస్ టిక్కెట్లను మొత్తం అన్ని పన్నులు కలుపుకోని 908 రూపాయలకే అందిస్తోంది. అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ ఆఫర్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. జనవరి 15 తర్వాత ప్రయాణించే ప్రయాణాలకు ఇది వర్తించనుంది.

Jet Airways Takes on AirAsia India With New Offer

జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించిన ఆఫర్‌‌లో భాగంగా కొచ్చి - బెంగుళూరు మార్గంలో టికెట్ ధర రూ. 908, బెంగుళూరు - కొచ్చి ఐతే రూ. 1162 అవుతుంది. బెంగుళూరు - చెన్నై టికెట్ ధర రూ. 1162.

చెన్నై - బెంగుళూరు మధ్య టికెట్ ధర రూ. 1017 అవుతుంది. గోవా -బెంగుళూరు టికెట్ ధర రూ. 916. ఐతే బెంగుళూరు - గోవా మాత్రం రూ. 1162గా ఉంది. బెంగుళూరు నుంచి చంఢీగఢ్, జైపూర్‌లకు మాత్రం టికెట్ ధర రూ. 2390గా నిర్ణయించారు. ఈ ఆఫర్లను ప్రయాణీకులు అందరూ వినియోగించుకోవాలని జెట్ ఎయిర్‌వేస్ పేర్కొంది.

English summary

ఎయిర్ ఏషియా కన్నా మెరుగైన ఆఫర్‌ జెట్ | Jet Airways Takes on AirAsia India With New Offer

Jet Airways has launched a promotional offer on the routes operated by budget carrier AirAsia India. Jet Airways is offering fares as low as Rs. 908 (all-inclusive) as part of this promotional scheme, which is applicable on economy class tickets.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X