సొగసైన టివిఎస్ ‘జెస్ట్-110’ విడుదల(పిక్చర్స్)
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో 30 శాతం వృద్ధి సాధించడమే తమ లక్ష్యమని టివిఎస్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జెఎస్ శ్రీనివాసన్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో ‘టివిఎస్ స్కూటీ జెస్ట్ 110' అనే కొత్త మోడల్ను శ్రీనివాసన్ మార్కెట్లోకి విడుదల చేశారు.
అత్యాధునిక శైలితోపాటు వైవిధ్యభరితమైన గ్రాఫిక్స్తో నెక్ట్స్ జెన్ 109.7 సిసి ఇంజన్తో రూపొందించామని ఆయన చెప్పారు. లీటరుకు 62 కిలో మీటర్ల మైలేజీ ఇచ్చే టివిఎస్ స్కూటీ జెస్ట్ 110 ఎక్స్ షోరూం ధరను 44,800 నిర్దేశించినట్లు తెలిపారు.
మొదటిసారిగా టెరిఫిక్ టర్కొయిస్తో పాటు పవర్ ఫుల్ పింక్, ఫైరీ రెడ్, డైనమిక్ వైట్, డేరింగ్ బ్లాక్ అనే ఐదు రంగుల్లో లభిస్తుందని ఆయన వివరించారు.
నిరుడు దేశవ్యాప్తంగా 17.5 లక్షల టివిఎస్ బైకులు అమ్ముడయ్యాయని, అది స్కూటర్ మార్కెట్ రంగంలో 15 శాతం వాటా సాధించిందని చెప్పారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఆ వాటాను 18 శాతానికి పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు.
టివిఎస్
దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో 30 శాతం వృద్ధి సాధించడమే తమ లక్ష్యమని టివిఎస్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జెఎస్ శ్రీనివాసన్ తెలిపారు.
టివిఎస్
గురువారం హైదరాబాద్లో ‘టివిఎస్ స్కూటీ జెస్ట్ 110' అనే కొత్త మోడల్ను శ్రీనివాసన్ మార్కెట్లోకి విడుదల చేశారు.
టివిఎస్
అత్యాధునిక శైలితోపాటు వైవిధ్యభరితమైన గ్రాఫిక్స్తో నెక్ట్స్ జెన్ 109.7 సిసి ఇంజన్తో రూపొందించామని ఆయన చెప్పారు.
టివిఎస్
లీటరుకు 62 కిలో మీటర్ల మైలేజీ ఇచ్చే టివిఎస్ స్కూటీ జెస్ట్ 110 ఎక్స్ షోరూం ధరను 44,800 నిర్దేశించినట్లు తెలిపారు.