గోల్డ్ కాయిన్స్ ఆవిష్కరించిన శిల్పాశెట్టి(పిక్చర్స్)
హైదరాబాద్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన ఆభరణాల సంస్థ రూపొందించిన కొత్త సత్యుగ్ గోల్డ్ కాయిన్స్ను విడుదల చేశారు. ఈ బంగారు నాణేలు తన సంస్థకు చెందిన స్టోర్స్లోనే కాకుండా ప్రముఖ ఇతర ఆభరణాల షాపుల్లోనూ లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా శిల్పాశెట్టి భర్త, వ్యాపార వేత్త రాజ్కుంద్రా మీడియాతో మాట్లాడారు.
తమ సంస్థ రూపొందించిన గోల్డ్ కాయిన్ భారతీయ జనతా పార్టీ చిహ్నం కమలం డిజైన్లో ఉందని తెలిపారు. నాణేలు రూపొందించడంలో నాణ్యత ప్రమాణాలు పాటించామని చెప్పారు. వాటిని అందంగా రూపొందించామని తెలిపారు.
ఇటీవలి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపికి అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. కొత్త ప్రభుత్వం భద్రత కలిగిన భారతదేశాన్ని రూపొందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ కల్పన, విద్య, వైద్యం, భద్రత, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. తాము భారతీయులమని ఎప్పుడూ గర్విస్తామని, తమ దేశానికి మంచే జరగాలని కోరుకుంటామని చెప్పారు.
శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన ఆభరణాల సంస్థ రూపొందించిన కొత్త సత్యుగ్ గోల్డ్ కాయిన్స్ను విడుదల చేశారు.
శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా
ఈ బంగారు నాణేలు తన సంస్థకు చెందిన స్టోర్స్లోనే కాకుండా ప్రముఖ ఇతర ఆభరణాల షాపుల్లోనూ లభిస్తాయని తెలిపారు.
శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా
ఈ సందర్భంగా శిల్పాశెట్టి భర్త, వ్యాపార వేత్త రాజ్కుంద్రా మీడియాతో మాట్లాడారు. తమ సంస్థ రూపొందించిన గోల్డ్ కాయిన్ భారతీయ జనతా పార్టీ చిహ్నం కమలం డిజైన్లో ఉందని తెలిపారు.
శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా
నాణేలు రూపొందించడంలో నాణ్యత ప్రమాణాలు పాటించామని చెప్పారు. వాటిని అందంగా రూపొందించామని తెలిపారు.
శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా
భారీ మెజార్టీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపికి అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. కొత్త ప్రభుత్వం భద్రత కలిగిన భారతదేశాన్ని రూపొందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.