ఐసిఏఐ ప్రెసిడెంట్గా ఎన్నికైన హైదరాబాదీ
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసిఏఐ)కు నూతన ప్రెసిడెంట్గా హైదరాబాద్కు చెందిన కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్గా హైదరాబాద్కు చెందిన కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ డాక్టర్ ఏఎస్ దుర్గా ప్రసాద్ ఎన్నికయ్యారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి(2014-15) దుర్గా ప్రసాద్ ఐసిఏఐ ప్రెసిడెంట్గా వ్యవహరించనున్నారు. గతంలో దుర్గా ప్రసాద్ ఐసిఏఐ దక్షిణ భారత ప్రాంత కౌన్సిల్ ఛైర్మన్గా కూడా వ్యవహరించారు.
త్వరలోనే నల్లధనం తెస్తాం: జైట్లీ
న్యూఢిల్లీ: విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకువచ్చేందుకు ఇంకెంతో కాలం పట్టదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అక్రమార్కులు విదేశాల్లో దాచుకుంటున్న మొత్తం సంపదను దేశంలోకి తేచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ఫ్రాన్స్ నుంచి అందుకున్న నల్లధనం సమాచారంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. నల్లధనం వ్యవహారానికి అధికార పరిధి అంటూ ఏమీలేదని తేల్చిచెప్పిన ఆయన, దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని తెలిపారు.
‘మా వద్ద ఏదైనా సమాచారం (నల్లధనానికి సంబంధించి) ఉంటే, దాన్ని మేము సుప్రీం కోర్టుతో పంచుకుంటాం. అలాగే సిట్కు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది.' అని శుక్రవారం లోక్సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా జైట్లీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విదేశాల్లోని నల్లధనాన్ని వెలికితీసేందుకు ఇంకా ఎంతో సమయం పట్టదని పేర్కొన్నారు. లీచెన్స్టెయిన్, స్విట్జర్లాండ్లోని ఓ బ్యాంకులో భారతీయుల ఖాతాలకు సంబంధించిన సమాచారం ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అందుకుందని కూడా ఆయన చెప్పారు.