కాఫీ మగ్గులు: మోడీ వర్సెస్ కేజ్రీవాల్ (ఫొటోలు)
న్యూఢిల్లీ: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వారణాసి లోకసభ స్థానంలో మాత్రమే ఢీకొనడం లేదు, వారిద్దరు ఆన్లైన్ ప్రపంచంలో కూడా పోటీ పడుతున్నారు. ఈ షాపింగ్ ప్రస్తుత ధోరణిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఎన్నికల వేళ కేజ్రీవాల్, మోడీ కాఫీ మగ్గులు ఆన్లైన్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ ట్రెండీ, స్టైలిష్ ఉత్పత్తులను ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
కేజ్రీవాల్, నరేంద్ర మోడీ పేరు మీద ఉత్పత్తులు బ్రాండ్లుగా మారాయి. వాటిని చూస్తే దిమ్మతిరిగి పోవడం ఖాయం.
నామో కాఫీ మగ్గు
త్రివర్ణ పతాకంతో నామో కాఫీ మగ్గు ఇలా అమ్మకానికి ఉంది. దీని ధర రూ.249. 20 శాతం తగ్గింపుతో 199 రూపాయలకు కొనవచ్చు.
కేజ్రీవాల్ కాఫీ మగ్గు
అరవింద్ కేజ్రీవాల్ అభిమానులు ఈ మగ్గును ఆన్లైన్లో కొనవచ్చు. దాని ధర రూ.395. 25 శాతం తగ్గింపుతో 295 రూపాలకు వస్తుంది.
నామో మగ్గు
దీని ధర రూ. 249. 20 శాతం తగ్గింపుతో 199 రూపాయలకు పొందవచ్చు.
కామన్ మ్యాన్ కప్
ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో ఈ కప్పు అమ్మకానికి ఉంది. దీని ధర రూ.395. 25 శాతం తగ్గింపుతో 295 రూపాయలకు పొందవచ్చు.
నామో నోట్బుక్
మోడీ పేరు మీద స్పైరల్ నోట్ బుక్ కూడా అమ్మకానికి ఉంది. దీని ధర 199 రూపాయలు. డెలివరీ చార్జీలు అదనంగా 30 రూపాయలు.
చీపురు బొమ్మ మగ్గు
అవినీతి ఊడ్చిపారేస్తామనే ఆమ్ ఆద్మీ పార్టీ చిహ్నం చీపురు బొమ్మతో మగ్గు అందుబాటులో ఉంది. దీని ధర 395 రూపాయలు. 25 శాతం తగ్గింపుతో 295 రూపాయలకు కొనవచ్చు.
ల్యాప్టాప్పై నామో మ్యాట్ షీట్
మీ ల్యాప్టాప్ కోసం మ్యాట్ షీట్ మోడీ ఇండియా ఫస్ట్ పేరుతో అందుబాటులో ఉంది. దీని ధర 299 రూపాయలు. 1 శాతం తగ్గింపుతో 295 రూపాయలకు పొందవచ్చు.
హ్యారీ పోటర్ స్టైల్లో కేజ్రీవాల్
హ్యారీ పోటర్ స్టైల్లో సూపర్ హీరోగా కేజ్రీవాల్ను చిత్రీకరిస్తూ ఓ పోస్టర్ అమ్మకానికి ఉంది. దీని ధర 495 రూపాయలు. 30 శాతం తగ్గింపుతో 345 రూపాయలకు లభిస్తుంది.
మోడీ పోస్టర్
నరేంద్ర మోడీ సందేశంతో ఆయన పోస్టర్ కూడా అమ్మకానికి ఉంది. దీని ధర 299 రూపాయలు. 43 శాతం తగ్గింపుతో 169 రూపాయలకు పొందవచ్చు.
ఆమ్ ఆద్మీ కుషన్
హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి పసుపు రంగం ఆమ్ ఆద్మీ పార్టీ కుషన్ అందుబాటులో ఉంది. దాని ధర 495 రూపాయలు. 20 శాతం తగ్గింపుతో 395 రూపాయలకు పొందవచ్చు.